భారత్, బంగ్లాదేశ్ మధ్య బంధం మరింత బలపడింది....
- March 23, 2016
భారత్, బంగ్లాదేశ్ మధ్య బంధం మరింత బలపడింది. రెండు దేశాల మధ్య విద్యుత్తు, ఇంటర్నెట్ సరఫరా వ్యవస్థ మరింత పటిష్టమైంది. విద్యుత్తు సరఫరా లైన్ను ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఆ విద్యుత్తు లైన్ వల్ల త్రిపురా రాష్ట్రం సుమారు 100 మెగావాట్ల విద్యుత్తును బంగ్లాదేశ్కు సరఫరా చేయనుంది. మరోవైపు బంగ్లాదేశ ప్రధాని షేక్ హసినా 100జీబీపీఎస్ ఇంటర్నెట్ బ్యాండ్విడ్త్ను ప్రారంభించారు. దీని ద్వారా అగర్తలా రాష్ర్టానికి ఇంటర్నెట్ సౌకర్యం లభించనుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇరు దేశాల ప్రధానులు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి మహమూద్ అలీ, భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, త్రిపురా సీఎం మానిక్ సర్కార్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







