భారత్‌లో 5 కు చేరిన ఒమిక్రాన్ కేసులు

- December 05, 2021 , by Maagulf
భారత్‌లో 5 కు చేరిన ఒమిక్రాన్ కేసులు

న్యూ ఢిల్లీ: దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్‌ ప్రపంచ దేశాలను వణికిస్తుంది.ఇప్పటికే ఈ ఒమిక్రాన్‌ వేరియంట్‌ 38 దేశాలకు పాకేసిందని నిపుణుల చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే.. మన దేశంలోనూ ఈ వేరియంట్‌ ప్రవేశించింది.ఇప్పటికే భారత్‌లో నాలుగు ఒమిక్రాన్‌ కేసులు నమోదు కాగా…ఇప్పుడు ఆ సంఖ్య 5 కు చేరుకుంది.

తాజాగా ఢిల్లీలో ఒమిక్రాన్‌ కేసు వెలుగు చూసింది.టాంజానియా నుంచి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్‌ నిర్ధారణ అయింది.అతన్ని ఎల్‌ఎన్‌జీపీ ఆస్పత్రికి తరలించి…చికిత్స అందిస్తున్నారు. మొన్న కర్ణాటకలో రెండు, నిన్న గుజరాత్‌, మహారాష్ట్ర లో ఒక్కో కేసు వెలుగు చూసిన సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com