‘మాస్క్’ ఉల్లంఘనలపై ప్రభుత్వంకు భారీ ఆదాయం!
- December 07, 2021
హైదరాబాద్: ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావంతో తెలంగాణ ప్రభుత్వం మళ్లీ నిబంధనలు కఠినం చేస్తోంది. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడాన్ని తప్పనిసరి చేశారు. లేదంటే వెయ్యి రూపాయల జరిమానా విధిస్తున్నారు. అంతేకాదు… కొందరిపై కేసులు కూడా నమోదు చేస్తున్నారు.గత ఏడాది మాస్క్ నిబంధన ఉల్లంఘించిన 3 లక్షల 26 వేల 758 మందిపై కేసులు నమోదు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసు నమోదు చేయడంతోపాటు వెయ్యి రూపాయల జరిమానా కూడా విధించారు.
ఈ లెక్కన రాష్ట్రంలో జరిమానా ఉల్లంఘనల కింద ఇప్పటివరకు 131 కోట్ల ఆదాయం వచ్చింది. ఇప్పటి వరకు హెల్మెట్ లేకపోతే...ఫోటోలు తీసి ఫైన్లు వేస్తున్న ట్రాఫిక్ పోలీసులు.. ఇప్పుడు మాస్క్ లేకుండా వాహనాలు నడిపేవారికి చలాన్లు వేస్తున్నారు. ఫోటోతో సహా మొబైల్స్కు మెస్సేజ్లు పెడుతున్నారు. దీనిపై ప్రజల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రెండు రూపాయల మాస్క్ పెట్టుకోకపోతే… వెయ్యి రూపాయల ఫైన్ వేస్తున్న పోలీసులు...పబ్లిక్ ప్లేస్లో ఉచితంగా మాస్క్లను అందుబాటులో ఉంచొచ్చు కదా అంటున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







