ప్రవాసులకు డ్రైవింగ్ లైసెన్సు జారీ కోసం కొత్త విధివిధానాలను పరిశీలిస్తున్న ప్రభుత్వం
- December 07, 2021
కువైట్: కువైట్ లో ట్రాఫిక్ రద్దీ పెరిగిపోతోంది. విదేశాల నుంచి వచ్చిన వారు, దేశీయంగా పెరుగుతున్న వాహనాల వినియోగం కారణంగా ట్రాఫిక్ హెవీగా అవుతోంది. దీంతో ట్రాఫిక్ సమస్య ను తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చే వారికి డ్రైవింగ్ లైసెన్సులు ఇచ్చే విషయంలో కాస్త కఠినంగా ఉండాలని భావిస్తోంది. ట్రాఫిక్ రద్దీని తగ్గించాలంటే ప్రవాసులకు డ్రైవింగ్ లైసెన్సుల జారీని తగ్గించే విధంగా కొత్త నిబంధనలు తేనుంది. ఇందుకు సంబంధించిన పలు అధ్యయనాలను పరిశీలిస్తోంది. సోమవారం అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సెక్రటరీ లెఫ్టినెంట్ జనరల్ షేక్ ఫైసల్ అల్ నవాఫ్ ట్రాఫిక్ విభాగం అధికారులతో సమావేశమై పలు ప్రతిపాదనలపై చర్చించారు. ట్రాఫిక్ సమస్యను తగ్గించే ఎలాంటి పద్దతులను అవలంభించాలో కూడా స్టడీ చేయాలని ఈ సందర్భంగా ఆయన అధికారులను కోరారు. అనంతరం అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ మాట్లాడుతూ... కువైట్ ను ప్రపంచంలోనే అత్యుత్తమ ట్రాఫిక్ వ్యవస్థల్లో ఒక్కటిగా తయారుచేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!







