ప్రవాసులకు డ్రైవింగ్ లైసెన్సు జారీ కోసం కొత్త విధివిధానాలను పరిశీలిస్తున్న ప్రభుత్వం
- December 07, 2021
కువైట్: కువైట్ లో ట్రాఫిక్ రద్దీ పెరిగిపోతోంది. విదేశాల నుంచి వచ్చిన వారు, దేశీయంగా పెరుగుతున్న వాహనాల వినియోగం కారణంగా ట్రాఫిక్ హెవీగా అవుతోంది. దీంతో ట్రాఫిక్ సమస్య ను తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చే వారికి డ్రైవింగ్ లైసెన్సులు ఇచ్చే విషయంలో కాస్త కఠినంగా ఉండాలని భావిస్తోంది. ట్రాఫిక్ రద్దీని తగ్గించాలంటే ప్రవాసులకు డ్రైవింగ్ లైసెన్సుల జారీని తగ్గించే విధంగా కొత్త నిబంధనలు తేనుంది. ఇందుకు సంబంధించిన పలు అధ్యయనాలను పరిశీలిస్తోంది. సోమవారం అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సెక్రటరీ లెఫ్టినెంట్ జనరల్ షేక్ ఫైసల్ అల్ నవాఫ్ ట్రాఫిక్ విభాగం అధికారులతో సమావేశమై పలు ప్రతిపాదనలపై చర్చించారు. ట్రాఫిక్ సమస్యను తగ్గించే ఎలాంటి పద్దతులను అవలంభించాలో కూడా స్టడీ చేయాలని ఈ సందర్భంగా ఆయన అధికారులను కోరారు. అనంతరం అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ మాట్లాడుతూ... కువైట్ ను ప్రపంచంలోనే అత్యుత్తమ ట్రాఫిక్ వ్యవస్థల్లో ఒక్కటిగా తయారుచేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని చెప్పారు.
తాజా వార్తలు
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!







