గోల్డెన్ జూబ్లీ సందర్భంగా 50 దిర్హాం కొత్తనోటును రిలీజ్ చేసిన సెంట్రల్ బ్యాంక్
- December 08, 2021
యూఏఈ: గోల్డెన్ జూబ్లీ(50 సంవత్సరాలు) దినోత్సవాన్నిపురస్కరించుకుని UAE సెంట్రల్ బ్యాంక్ 50 దిర్హాం కొత్త నోటును విడుదల చేసింది. ఈ నోటుపై ఫౌండింగ్ ఫాదర్ దివంగత షేక్ జాయెద్ ఫోటోని ముద్రించారు. మరోపక్క ఎమిరేట్స్ మొదటి తరం రూలర్స్ చిత్రాన్ని ముద్రించారు. దేశాన్ని ఏకం చేయడంలో వారి అంకితభావం, చారిత్రక పాత్రను గౌరవించేలా కొత్త నోటును సెంట్రల్ బ్యాంక్ తీసుకొచ్చింది. దీన్ని తొలిసారి పాలిమర్ మెటీరియల్తో తయారు చేశారు. అడ్వాన్స్ డ్ సెక్యూరిటీ ఫీచర్స్ తో రూపొందించారు. కొత్త నోటు త్వరలోనే సెంట్రల్ బ్యాంకు బ్రాంచీలు, ఏటీఎంలలో అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం సర్క్యులేషన్ లో ఉన్న 50 దిర్హం నోటు కూడా చెల్లుబాటు అవుతుందని సెంట్రల్ బ్యాంక్ చెప్పింది.
తాజా వార్తలు
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్లో తెలంగాణ వాసి మృతి







