దుబాయ్ ఎక్స్ పోను సందర్శించిన షేక్ హమ్దాన్, మహ్మద్ బిన్ సల్మాన్

- December 09, 2021 , by Maagulf
దుబాయ్ ఎక్స్ పోను సందర్శించిన షేక్ హమ్దాన్, మహ్మద్ బిన్ సల్మాన్

దుబాయ్: సౌదీ అరేబియా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్, దుబాయ్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ బుధవారం దుబాయ్ ఎక్స్ పో 2020 ని సందర్శించారు. యూఏఈ, సౌదీ అరేబియా పెవిలియన్‌లను సందర్శించారు. వీరి వెంట డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ షేక్ మన్సూర్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కూడా ఉన్నారు. మహ్మద్ బిన్ సల్మాన్‌ను కలవడం సంతోషంగా ఉందని, సౌదీ అరేబియాతో యూఏఈ  సంబంధం "బలవంతం" అవుతోందని షేక్ హమ్దాన్ ట్వీట్ చేశారు. గల్ఫ్ దేశాల పర్యటనలో ఉన్న మహ్మద్ బిన్ సల్మాన్ యూఏఈలో తన రెండు రోజుల పర్యటన ముగించుకుని అబుదాబి ప్రెసిడెన్షియల్ ఎయిర్‌పోర్ట్ నుండి బయలుదేరారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com