భారత సీడీఎస్ హెలికాప్టర్ ప్రమాదంలో మృతులకు కువైట్ అమీర్ సంతాపం

- December 10, 2021 , by Maagulf
భారత సీడీఎస్ హెలికాప్టర్ ప్రమాదంలో మృతులకు కువైట్ అమీర్ సంతాపం

కువైట్: ఇండియాలో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ (సీడీఎస్) సహా ఇతర ఉన్నతాధికారులకు కువైట్ అమీర్ షేక్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబా సంతాపం తెలిపారు. ఈమేరకు ఆయన భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌కు గురువారం లేఖ పంపారు. ప్రమాదంలో గాయపడ్డ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ వరుణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రిన్స్ షేక్ మిషాల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబా,  ప్రధాన మంత్రి షేక్ సబా ఖలీద్ అల్-హమద్ అల్-సబా కూడా ప్రమాదంపై తమ సంతాపం తెలియజేశారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్‌తో వెళ్తున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ తమిళనాడులోని కూనూర్ సమీపంలో బుధవారం కుప్పకూలింది. ఈ ఘటనలో భారత సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ సహా 13 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి ,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com