భారత సీడీఎస్ హెలికాప్టర్ ప్రమాదంలో మృతులకు కువైట్ అమీర్ సంతాపం
- December 10, 2021
కువైట్: ఇండియాలో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ (సీడీఎస్) సహా ఇతర ఉన్నతాధికారులకు కువైట్ అమీర్ షేక్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబా సంతాపం తెలిపారు. ఈమేరకు ఆయన భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్కు గురువారం లేఖ పంపారు. ప్రమాదంలో గాయపడ్డ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ వరుణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రిన్స్ షేక్ మిషాల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబా, ప్రధాన మంత్రి షేక్ సబా ఖలీద్ అల్-హమద్ అల్-సబా కూడా ప్రమాదంపై తమ సంతాపం తెలియజేశారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్తో వెళ్తున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ తమిళనాడులోని కూనూర్ సమీపంలో బుధవారం కుప్పకూలింది. ఈ ఘటనలో భారత సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ సహా 13 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి ,కువైట్)
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







