అబుధాబి ప్రిన్స్ షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ తో బిల్ గేట్స్ భేటీ
- December 10, 2021
యూఏఈ: బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ కో-చైర్ బిల్ గేట్స్ అబుధాబి ప్రిన్స్, యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ డిప్యూటీ సుప్రీం కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ను కలిశారు. ప్రపంచ మానవతా కార్యక్రమాల్లో షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ సేవలను బిల్ గేట్స్ ప్రశంసించారు. చాలా దేశాలలో జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి యూఏఈ అందిస్తున్న సహాయాన్ని ఆయన ప్రస్తావిస్తూ షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ కు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం భవిష్యత్తులో ఉమ్మడిగా చేపట్టనున్న పలు కార్యక్రమాల గురించి చర్చించారు. ముఖ్యంగా ప్రివెంటబుల్ కమ్యూనికబుల్ డిసీజెస్, పేద వర్గాలలో జీవన పరిస్థితులను మెరుగుపరచడానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై తీసుకోవాల్సిన చర్యలపై డిస్ కస్ చేశారు. దశాబ్ద కాలం నుంచి యూఏఈ, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ సంయుక్తంగా ప్రపంచ వ్యాప్తంగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







