అబుధాబి ప్రిన్స్ షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ తో బిల్ గేట్స్ భేటీ
- December 10, 2021
యూఏఈ: బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ కో-చైర్ బిల్ గేట్స్ అబుధాబి ప్రిన్స్, యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ డిప్యూటీ సుప్రీం కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ను కలిశారు. ప్రపంచ మానవతా కార్యక్రమాల్లో షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ సేవలను బిల్ గేట్స్ ప్రశంసించారు. చాలా దేశాలలో జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి యూఏఈ అందిస్తున్న సహాయాన్ని ఆయన ప్రస్తావిస్తూ షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ కు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం భవిష్యత్తులో ఉమ్మడిగా చేపట్టనున్న పలు కార్యక్రమాల గురించి చర్చించారు. ముఖ్యంగా ప్రివెంటబుల్ కమ్యూనికబుల్ డిసీజెస్, పేద వర్గాలలో జీవన పరిస్థితులను మెరుగుపరచడానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై తీసుకోవాల్సిన చర్యలపై డిస్ కస్ చేశారు. దశాబ్ద కాలం నుంచి యూఏఈ, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ సంయుక్తంగా ప్రపంచ వ్యాప్తంగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







