భారత్లో మరో రెండు ఒమిక్రాన్ కేసులు
- December 10, 2021
న్యూ ఢిల్లీ: భారత్లో మరో ఇద్దరికి ఒమిక్రాన్ వేరియంట్ నిర్ధారణ అయ్యింది.దీంతో భారత్లో మొత్తం ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 25కి చేరింది. గుజరాత్లోని జామ్నగర్లో ఈ రెండు పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. ఇటీవల జింబాబ్వే నుంచి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ నిర్ధారణ కాగా.. తాజాగా, ఆయన భార్య, బావమరిదికి కూడా ఈ కొత్త వేరియంట్ సోకినట్టు నిర్ధారణ అయిందని జామ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ విజయ్కుమార్ ఖారాడీ వెల్లడించారు. తాజా కేసులతో గుజరాత్లో ఒమిక్రాన్ బాధితుల సంఖ్య మూడుగా నమోదయ్యింది.
వారం రోజుల కిందట జింబాబ్వే నుంచి 72 ఏళ్ల వృద్ధుడు గుజరాత్లోని జామ్నగర్కు రాగా ఆయనకు కోవిడ్ నిర్ధారణ కాగా.. జన్యు పరీక్షల్లో ఒమిక్రాన్గా తేలింది. ఆ మర్నాడే అతడి భార్యతో పాటు బావమరిదికి నిర్వహించిన పరీక్షల్లో కొవిడ్ -19 పాజిటివ్గా తేలడంతో జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం నమూనాలను గాంధీనగర్లోని గుజరాత్ బయోటెక్నాలజీ రీసెర్చి సెంటర్కు పంపారు. ఇద్దరిలోనూ ఒమిక్రాన్ వేరియంట్ నిర్ధారణ అయ్యింది.
దీంతో జామ్నగర్లోని గురుగోవింద్ సింగ్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన ఒమిక్రాన్ వార్డులో ముగ్గురుకీ చికిత్స కొనసాగుతోంది. ప్రస్తుతం ముగ్గురి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. వీరిలో కోవిడ్ లక్షణాలు స్వల్పంగానే ఉన్నాయని ఆయన తెలిపారు. దేశంలో తొలిసారి బెంగళూరులో ఇద్దరికి ఒమిక్రాన్ నిర్ధారణ అయ్యింది. ఇప్పటి వరకూ మహారాష్ట్రలో 10, రాజస్థాన్లో 9, గుజరాత్లో 3, కర్ణాటకలో 2, ఢిల్లీ ఒక్కో కేసు బయటపడింది. ప్రపంచంలో 60 దేశాలకు ఈ వేరియంట్ విస్తరించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!