కరోనా బూస్టర్ డోస్ తీసుకోండి-ప్రజలను నేషనల్ టాస్క్ ఫోర్స్ విజ్ఞప్తి
- December 16, 2021
బహ్రెయిన్: కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొవటానికి బూస్టర్ డోస్ తీసుకోవాలని నేషనల్ టాస్క్ ఫోర్స్ కోరింది. ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంలో బూస్టర్ డోస్ ప్రభావాన్ని నేషనల్, ఇంటర్నేషనల్ సంస్థలు ఇప్పటికే నిరూపించాయని టాస్క్ ఫోర్స్ అధికారులు గుర్తుచేశారు. బూస్టర్ డోస్ కూడా వ్యాక్సిన్ ప్రోటోకాల్ లో భాగమని అన్నారు కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ రెండు డోసుల వ్యాక్సిన్ తో పాటు బూస్టర్ డోస్ ను కూడా వేసుకోవటం తప్పనిసరి అని చెప్పారు. ఇక పిల్లలకు వ్యాక్సినేషన్ చేయించే విషయంలో వారి పేరెంట్స్ చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తీవ్రతను బూస్టర్ డోస్ తగ్గిస్తుందని పరిశోధనల్లో తేలిందని...అందుకే అర్హులైన వారందరూ బూస్టర్ డోస్ తీసుకోవాలని నేషనల్ టాస్క్ ఫోర్స్ కోరింది.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- కష్టపడే వారికే పదవులు: కేసీఆర్
- ఉత్తర అల్ బతీనాహ్లో అంబులెన్స్ ప్రమాదం
- IPL 2026: సన్రైజర్స్ హైదరాబాద్ పై గుజరాత్ టైటాన్స్ ఘన విజయం
- అనుమతి లేని ఎయిర్లైన్స్తో టికెట్లు బుక్ చేయవద్దు: కువైట్ DGCA హెచ్చరిక
- ట్రాన్స్జెండర్ల సంక్షేమానికి ఏపీ ప్రభుత్వం కీలక అడుగు
- రష్యా వీసా ఖర్చుల భారం లేకుండా ట్రిప్ ప్లాన్
- యూఏఈలో రేపటి వాతావరణం ప్రశాంతం
- ఆన్లైన్ క్లాసులు నిర్వహించండి..స్కూళ్లకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి
- భారత దేశవ్యాప్తంగా NEET పరీక్ష రద్దు..కేంద్రం సంచలన నిర్ణయం
- తమిళనాడులో సీఎం విజయ్ షణ్ముగంతో కీలక భేటీ









