కరోనా బూస్టర్ డోస్ తీసుకోండి-ప్రజలను నేషనల్ టాస్క్ ఫోర్స్ విజ్ఞప్తి
- December 16, 2021
బహ్రెయిన్: కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొవటానికి బూస్టర్ డోస్ తీసుకోవాలని నేషనల్ టాస్క్ ఫోర్స్ కోరింది. ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంలో బూస్టర్ డోస్ ప్రభావాన్ని నేషనల్, ఇంటర్నేషనల్ సంస్థలు ఇప్పటికే నిరూపించాయని టాస్క్ ఫోర్స్ అధికారులు గుర్తుచేశారు. బూస్టర్ డోస్ కూడా వ్యాక్సిన్ ప్రోటోకాల్ లో భాగమని అన్నారు కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ రెండు డోసుల వ్యాక్సిన్ తో పాటు బూస్టర్ డోస్ ను కూడా వేసుకోవటం తప్పనిసరి అని చెప్పారు. ఇక పిల్లలకు వ్యాక్సినేషన్ చేయించే విషయంలో వారి పేరెంట్స్ చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తీవ్రతను బూస్టర్ డోస్ తగ్గిస్తుందని పరిశోధనల్లో తేలిందని...అందుకే అర్హులైన వారందరూ బూస్టర్ డోస్ తీసుకోవాలని నేషనల్ టాస్క్ ఫోర్స్ కోరింది.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- లోక్సభ లెజిస్లేషన్ కమిటీ సమావేశం నిర్వహించిన ఎంపీ బాలశౌరి
- గ్లోబల్ సమ్మిట్ కు ప్రధాని మోడీ ని ఆహ్వానించాలి: సీఎం రేవంత్
- 2030 కామన్వెల్త్ గేమ్స్ కోసం అహ్మదాబాద్ సిద్దం
- హాంకాంగ్లో ఘోర అగ్ని ప్రమాదం..13 మంది సజీవదహనం..
- అల్-మసీలా బ్రిడ్జి అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక..!!
- కెనడా eTA కి ఖతారీ జాతీయులు అర్హులు..!!
- సౌదీ అరేబియాలో జనవరి 1నుండి న్యూ ట్యాక్స్ పాలసీ..!!
- మరణించిన వారి ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేస్తున్నారా?
- 'ఒమన్ ఒడిస్సీ' పుస్తకం విడుదల..!!
- BD 130,000 పెట్టుబడికే బహ్రెయిన్ గోల్డెన్ రెసిడెన్సీ..!!







