హైదరాబాద్లో ఒమిక్రాన్ టెన్షన్..
- December 16, 2021
హైదరాబాద్: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ హైదరాబాద్లో ఎంటరైంది.విదేశాల నుంచి వచ్చిన ఇద్దరికి ఒమిక్రాన్ పాజిటివ్గా తేలినట్టు తెలంగాణ వైద్య శాఖ ప్రకటించింది.కెన్యా, సోమాలియా నుంచి వచ్చిన ఇద్దరు విదేశీయులకు కరోనా పాజిటివ్గా తేలడంతో శాంపిల్స్ సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్కి పంపించడం..వారికి ఒమిక్రాన్ పాజిటివ్గా నిర్ధారణ కావడంతో ఆస్పత్రిలో చికిత్స అందించడం జరుగుతున్నాయి.కొత్త వేరియంట్ ఎంట్రీతో అప్రమత్తం అయ్యారు అధికారులు..ఇక, ఆ ఇద్దరూ మొహిదీపట్నం టోలీచౌకీ ప్రాంత వాసులే కావడంతో.. ఆ ప్రాంతంలో ట్రేసింగ్, టెస్టింగ్పై ఫోకస్ పెట్టారు.
ప్రస్తుతం టోలీచౌకీలోని పారామౌంట్ కాలనీ.. ఒమిక్రాన్తో ఉలిక్కిపడింది.అక్కడ విస్తృతంగా టెస్ట్లు చేస్తున్నారు.దీని కోసం 25 హెల్త్ టీమ్స్ను రంగంలోకి దించారు అధికారులు..700 ఇళ్లలో ఉన్న జనాలకు పరీక్షలు నిర్వహిస్తున్నారు.. ఇప్పటి వరకు 136 మందికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు పూర్తి చేశారు.. మరో 36 గంటల తర్వాత ఆ టెస్ట్లకు సంబంధించిన ఫలితాలు రానుండగా...ఆర్టీపీసీఆర్లో పాజిటివ్గా తేలితే.. సదరు వ్యక్తుల శాంపిల్స్ను జీనోమ్ సీక్వెన్స్కి పంపనున్నారు.ఆ తర్వాతే..వారికి సోకింది కోవిడా..? లేదా ఒమిక్రాన్ వేరియంటా? అనేది తేలిపోనుంది.మొత్తంగా.. ఒమిక్రాన్ టెన్షన్ ఇప్పుడు టోలీచౌకీ వాసులను కలవరపెడుతోంది.
తాజా వార్తలు
- భారత జట్టు తదుపరి మ్యాచ్ల షెడ్యూల్ ఇదే..!
- బెంగళూరులో రేపటి నుంచి హోటళ్లు బంద్
- ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా దుబాయ్–వరుసగా ఆరవ సంవత్సరం గుర్తింపు
- తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
- అమరవీరులకు కువైట్ కన్నీటి నివాళి: సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
- లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం
- యూఏఈలో హెలికాప్టర్ ప్రమాదం: ఇద్దరు సాయుధ దళాల సిబ్బంది మృతి
- గల్ఫ్ దేశాల్లో 12వ తరగతి పరీక్షలు వాయిదా–CBSE కీలక నిర్ణయం
- 23400 ఉల్లంఘనలు..1,200 వాహనాలు సీజ్..!!
- వీడియోలు, ఫోటోలు షేర్.. 313 మంది అరెస్టు..!!









