ముగింపు దశకు రియాద్ మెట్రో ప్రాజెక్ట్.. 92 శాతం పనులు పూర్తి
- December 17, 2021
సౌదీ-రియాద్: సౌదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రియాద్ మెట్రో ప్రాజెక్ట్ నిర్మాణం ముగింపు దశకు చేరుకుంది. దాదాపు 92 శాతం సివిల్ పనులు పూర్తయినట్లు రియాద్ సిటీ రాయల్ కమిషన్ ప్రకటించింది. కమిషన్ సలహాదారు హోసామ్ అల్-ఖురాషి గురువారం ప్రాజెక్ట్ పనులను పరిశీలించారు. అనంతరం అల్-ఖురాషి మాట్లాడుతూ.. 180 మెట్రో ట్రైన్లు 2 మిలియన్ కిలోమీటర్ల ట్రయల్ రన్ పూర్తి చేశాయన్నారు. ఈ మెట్రో ప్రాజెక్ట్ 2022 ఫస్ట్ క్వార్టర్ కల్లా పబ్లిక్ కు అందుబాటులోకి వస్తుందన్నారు. కింగ్ అబ్దుల్ అజీజ్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ప్రాజెక్ట్ లో భాగమైన దీంట్లో మెట్రో రైళ్లు, ఎలక్ట్రిక్ బస్సులు ఉంటాయని తెలిపారు. రియాద్ మెట్రో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టులలో ఒకటన్న అల్-ఖురాషి.. మొత్తం 1800 కి.మీ విస్తీర్ణంలో ఆరు ప్రధాన మెట్రో లైన్లు, 85 రైల్వే స్టేషన్లు ఉన్నాయన్నారు. రియాద్ మెట్రో అమల్లోకి వస్తే 2.50 లక్షల కార్ల ట్రిప్పులు మిగిలి 4 లక్షల లీటర్ల ఇంధనం ఆదా అవుతుందని, ఆ మేరకు కార్బన్ ఉద్గారాల శాతం తగ్గి పర్యావరణానికి మేలు జరుగుతుందన్నారు.
తాజా వార్తలు
- నెదర్లాండ్స్ చేరుకున్న ప్రధాని మోదీ–భారత్-ఈయూ వాణిజ్య బంధాలకు కొత్త ఊపు
- స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్రతో స్పష్టమైన మార్పు: సీఎం చంద్రబాబు
- ప్రమాదకర డ్రైవింగ్కు పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న దుబాయ్ పోలీసులు
- సైబర్ నేరాల నిర్మూలనకు 90 రోజుల యాక్షన్ ప్లాన్: ఏపీ డీజీపీ..
- సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్నారై తెలుగుదేశం మహానాడు
- యూఏఈలో ఇళ్లు, వాహనాలు, కార్గోకు వార్ రిస్క్ ఇన్సూరెన్స్ విస్తరణ
- ఎపి సిఎస్ సాయి ప్రసాద్ పదవీ కాలం నవంబరు 30 వరకు పొడిగింపు
- NEET లీకేజీ సూత్రధారి అరెస్ట్.. పుణేలో అదుపులోకి తీసుకున్న సీబీఐ..!
- విద్యార్థుల భద్రత కోసం ‘సురక్ష కవచ్’ హ్యాండ్బుక్ ఆవిష్కరణ
- న్యూఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులతో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా భేటీ









