ముగింపు దశకు రియాద్ మెట్రో ప్రాజెక్ట్.. 92 శాతం పనులు పూర్తి
- December 17, 2021
సౌదీ-రియాద్: సౌదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రియాద్ మెట్రో ప్రాజెక్ట్ నిర్మాణం ముగింపు దశకు చేరుకుంది. దాదాపు 92 శాతం సివిల్ పనులు పూర్తయినట్లు రియాద్ సిటీ రాయల్ కమిషన్ ప్రకటించింది. కమిషన్ సలహాదారు హోసామ్ అల్-ఖురాషి గురువారం ప్రాజెక్ట్ పనులను పరిశీలించారు. అనంతరం అల్-ఖురాషి మాట్లాడుతూ.. 180 మెట్రో ట్రైన్లు 2 మిలియన్ కిలోమీటర్ల ట్రయల్ రన్ పూర్తి చేశాయన్నారు. ఈ మెట్రో ప్రాజెక్ట్ 2022 ఫస్ట్ క్వార్టర్ కల్లా పబ్లిక్ కు అందుబాటులోకి వస్తుందన్నారు. కింగ్ అబ్దుల్ అజీజ్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ప్రాజెక్ట్ లో భాగమైన దీంట్లో మెట్రో రైళ్లు, ఎలక్ట్రిక్ బస్సులు ఉంటాయని తెలిపారు. రియాద్ మెట్రో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టులలో ఒకటన్న అల్-ఖురాషి.. మొత్తం 1800 కి.మీ విస్తీర్ణంలో ఆరు ప్రధాన మెట్రో లైన్లు, 85 రైల్వే స్టేషన్లు ఉన్నాయన్నారు. రియాద్ మెట్రో అమల్లోకి వస్తే 2.50 లక్షల కార్ల ట్రిప్పులు మిగిలి 4 లక్షల లీటర్ల ఇంధనం ఆదా అవుతుందని, ఆ మేరకు కార్బన్ ఉద్గారాల శాతం తగ్గి పర్యావరణానికి మేలు జరుగుతుందన్నారు.
తాజా వార్తలు
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్లో తెలంగాణ వాసి మృతి







