బిజినెస్ డిస్ట్రిక్ట్గా మారనున్న ఎక్స్పో దుబాయ్ ప్రాంగణం
- December 17, 2021
దుబాయ్: ఎక్స్పో దుబాయ్ 2020 మార్చి 2022లో ముగియనుంది. అనంతరం ఈ ప్రాంగణాన్ని బిజినెస్ డిస్ట్రిక్ట్గా వినియోగించనున్నారు. విద్యా సంస్థలు, ఆసుపత్రులు, స్టేట్ ఆఫ్ ఆర్ట్ బిల్డింగ్ మేనేజిమెంట్ సిస్టమ్స్ వంటివాటితో డిస్ట్రిక్ట్ 2020 ప్రాజెక్టు రూపొందించనున్నారు. యూఏఈ రెసిడెంట్స్కి రెసిడెన్షియల్ మరియు బిజినెస్ హబ్గా ఇది మారబోతోంది. లెగసీ ప్రాజెక్టు వైస్ ప్రెసిడెంట్ నదిమెహ్ మెహ్రా మాట్లాడుతూ, స్కేల్ 2 దుబాయ్ పేరుతో కొత్త మార్కెట్ సృష్టించేలా దీన్ని తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. ఉచితంగా వర్క్ స్పేస్, రెండేళ్ళ వీసా.. ఇలా ప్రత్యేక అవకాశాలు కూడా కల్పించనున్నారు. డిస్ట్రిక్ట్ 2020లో 145,000 మంది నివసించడానికి, పని చేసుకోవడానికి, సందర్శించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రానున్న 25 ఏళ్ళలో ఇదొక పెద్ద హబ్గా రూపాంతరం చెందనుంది. టెర్రా ది సస్టెయినబిలిటీ పెవిలియన్, పిల్లలకు సంబంధించిన అలాగే సైన్స్ సెంటర్గా సేవలందించనుంది. ఎక్స్పో కోసం జరిగిన ఏర్పాట్లు, ఇతర కార్యకలాపాలకు వీలుగా వున్నాయి. కొన్ని తాత్కాలిక ఏర్పాట్లను మాత్రం ఎక్స్పో తర్వాత తొలగించనున్నారు. వాటి స్థానంలో శాశ్వత నిర్మాణాలు చేస్తారు.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







