బిజినెస్ డిస్ట్రిక్ట్గా మారనున్న ఎక్స్పో దుబాయ్ ప్రాంగణం
- December 17, 2021
దుబాయ్: ఎక్స్పో దుబాయ్ 2020 మార్చి 2022లో ముగియనుంది. అనంతరం ఈ ప్రాంగణాన్ని బిజినెస్ డిస్ట్రిక్ట్గా వినియోగించనున్నారు. విద్యా సంస్థలు, ఆసుపత్రులు, స్టేట్ ఆఫ్ ఆర్ట్ బిల్డింగ్ మేనేజిమెంట్ సిస్టమ్స్ వంటివాటితో డిస్ట్రిక్ట్ 2020 ప్రాజెక్టు రూపొందించనున్నారు. యూఏఈ రెసిడెంట్స్కి రెసిడెన్షియల్ మరియు బిజినెస్ హబ్గా ఇది మారబోతోంది. లెగసీ ప్రాజెక్టు వైస్ ప్రెసిడెంట్ నదిమెహ్ మెహ్రా మాట్లాడుతూ, స్కేల్ 2 దుబాయ్ పేరుతో కొత్త మార్కెట్ సృష్టించేలా దీన్ని తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. ఉచితంగా వర్క్ స్పేస్, రెండేళ్ళ వీసా.. ఇలా ప్రత్యేక అవకాశాలు కూడా కల్పించనున్నారు. డిస్ట్రిక్ట్ 2020లో 145,000 మంది నివసించడానికి, పని చేసుకోవడానికి, సందర్శించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రానున్న 25 ఏళ్ళలో ఇదొక పెద్ద హబ్గా రూపాంతరం చెందనుంది. టెర్రా ది సస్టెయినబిలిటీ పెవిలియన్, పిల్లలకు సంబంధించిన అలాగే సైన్స్ సెంటర్గా సేవలందించనుంది. ఎక్స్పో కోసం జరిగిన ఏర్పాట్లు, ఇతర కార్యకలాపాలకు వీలుగా వున్నాయి. కొన్ని తాత్కాలిక ఏర్పాట్లను మాత్రం ఎక్స్పో తర్వాత తొలగించనున్నారు. వాటి స్థానంలో శాశ్వత నిర్మాణాలు చేస్తారు.
తాజా వార్తలు
- AI పరిశోధనలకు బిట్స్ పిలానీ–ఐఏఐఆర్వో భాగస్వామ్యం..
- అమెరికాలో జూలైలో 23 వేల ఉద్యోగాల కోత..
- 'AI'తో కొత్త ఉద్యోగాలు !!
- సౌదీ–టర్కీ–పాకిస్థాన్ మధ్య 'మక్కా సంయుక్త రక్షణ ఒప్పందం'..
- జీఎస్టీ ఆదాయం పెంపునకు ఏఐ వినియోగం..కొత్త కార్యాచరణపై సీఎం రేవంత్ సమీక్ష
- ఢిల్లీ విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్ భగ్నం..
- ఫార్వర్డ్ చేసే ముందు ఒకసారి ఆలోచించండి.. ప్రజలకు కీలక సూచనలు జారీ చేసిన TDRA
- గుడివాడ–శివమొగ్గ ప్రత్యేక రైలుకు గ్రీన్ సిగ్నల్ దిశగా ముందడుగు.. ఎంపీ బాలశౌరి కృషికి ఫలితం
- యూఏఈలో భారతీయులకు పాస్పోర్ట్, కాన్సులర్ సేవలను మరింత వేగవంతం
- యూఏఈ–రష్యా అధ్యక్షుల ఫోన్ సంభాషణ.. ద్వైపాక్షిక సహకారం, మిడిల్ ఈస్ట్ పరిణామాలపై చర్చ







