యూఏఈ వ్యాపారవేత్త మజిద్ అల్ ఫుట్టైమ్ కన్నుమూత

- December 18, 2021 , by Maagulf
యూఏఈ వ్యాపారవేత్త మజిద్ అల్ ఫుట్టైమ్ కన్నుమూత

యూఏఈ: యూఏఈ బిజినెస్ మెన్ మజిద్ అల్ ఫుట్టైమ్ కన్నుమూశారు. ఆయన మరణం పట్ల దుబాయ్ పాలకుడు ట్విట్టర్‌లో నివాళులర్పించారు. దుబాయ్ అత్యంత ముఖ్యమైన వ్యాపార నాయకులలో అల్ ఫుట్టైమ్ ఒకరిగా కొనియాడారు. అల్ ఫుట్టైమ్ 1992లో మజిద్ అల్ ఫుట్టైమ్ గ్రూప్‌ ను స్థాపించారు.యూఏఈలో అల్ ఫుట్టైమ్ కు మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్, మిర్డిఫ్ సిటీ సెంటర్ లు ఉన్నాయి. దీంతోపాటు ఆఫ్రికా, ఆసియా, మిడిల్ ఈస్ట్ లలో 300కి పైగా క్యారీఫోర్ సూపర్ మార్కెట్‌లు, హైపర్ మార్కెట్‌లు ఉన్నాయి. ముఖ్యంగా మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్ దుబాయ్‌లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని దుబాయ్ రూలర్ గుర్తు చేసుకున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com