జెడ్డా సెంట్రల్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన ప్రిన్స్ సల్మాన్
- December 18, 2021
సౌదీ: జెడ్డా సెంట్రల్ ప్రాజెక్ట్ మాస్టర్ ప్లాన్ ను శుక్రవారం ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ప్రారంభించారు. ఈ ప్రాజెక్టును గతంలో న్యూ జెడ్డా డౌన్టౌన్ అని పిలిచేవారు. ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టును SR75 బిలియన్ డాలర్లతో ఎర్ర సముద్రానికి దగ్గరలో 5.7 మిలియన్ చదరపు మీటర్లలో నిర్మించనున్నారు. ఈ జెడ్డా సెంట్రల్ ప్రాజెక్ట్ 2030 నాటికి SR47 బిలియన్ల అదనపు విలువను చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ప్రాజెక్టులో భాగంగా ఒపెరా హౌస్, మ్యూజియం, స్పోర్ట్స్ స్టేడియం, ఓషనేరియం అనే నాలుగు ప్రముఖ ల్యాండ్మార్క్ లను ఏర్పాటు చేయనున్నారు. టూరిజం, వినోదం, సంస్కృతి, స్పోర్ట్స్ తో సహా ఆర్థిక రంగాల అభివృద్ధికి ఈ ప్రాజెక్ట్ దోహదం చేయనుందని అధికారులు తెలిపారు. లోకల్, ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్లు ఈ ప్రాజెక్టులో భాగం కానున్నారు.
తాజా వార్తలు
- యుద్ధ ప్రభావిత వ్యాపారాల పునరుద్ధరణకు షార్జా ఆర్థిక ఉపశమన ప్యాకేజీ
- హాకీ ‘నేషన్స్ కప్’ విజేతగా భారత్
- మరోసారి ఇరాన్ కు ట్రంప్ వార్నింగ్
- NEET పరీక్షలో మాల్ప్రాక్టీస్..
- యోగాతో శారీరక–మానసిక ఆరోగ్యం మెరుగుదల
- బ్రిటన్ ప్రధాని స్టార్మర్ రాజీనామా..
- న్యూఢిల్లీలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం-2026 వేడుకలు
- దుబాయ్ గురునానక్ దర్బార్ గురుద్వారా సాధారణ వేళల పునరుద్ధరణ
- దుబాయ్లో 59% తగ్గనున్న బస్ ట్రావెల్ టైమ్..!!
- కువైట్ ఆసుపత్రులలో క్వైయిట్ అవర్స్..!!







