భారత్లో పెరిగిపోతున్న స్పామ్ కాల్స్
- December 18, 2021
న్యూ ఢిల్లీ: భారత్లో స్పామ్ కాల్స్ పెరిగిపోతున్నాయి.స్పామ్ కాల్స్ పై ట్రూకాలర్ ఓ నివేదికను తయారు చేసింది.ఈ నివేదిక ప్రకారం దేశంలో రోజు రోజుకు స్పామ్ కాల్స్ పెరిగిపోతున్నాయని, గతేడాది స్పామ్ కాల్స్ విషయంలో 9 వ స్థానంలో ఉన్న భారత్,ఈ ఏడాది 4 వ స్థానానికి చేరిందని ట్రూకాలర్ పేర్కొన్నది.ఓ స్పామ్ కాల్ నెంబర్ నుంచి 6 లక్షల 40 వేల మందికి 20 కోట్ల సార్లు కాల్స్ వెళ్లాయని ట్రూకాలర్ తెలియజేసింది.దీన్ని బట్టి దేశంలో స్పామ్ కాల్స్ ఏస్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
ప్రతి గంటకు 27 వేల మందికి స్పామ్ కాల్స్ వెళ్లినట్టు నివేదికలో పేర్కొన్నది. ప్రపంచంలో స్పామ్ కాల్స్ను ఎదుర్కొంటున్న దేశాల్లో బ్రెజిల్ మొదటి స్థానంలో ఉండగా, పెరూ రెండో స్థానంలో నిలిచింది. స్పామ్ కాల్స్లో అత్యథికశాతం మార్కెటింగ్ లేదా టెలిమార్కెటింగ్ కోసమే చేసినవని ట్రూకాలర్ పేర్కొన్నది. అక్టోబర్ నాటికి 37.8 బిలియన్ స్పామ్ కాల్స్ను బ్లాక్ చేయగా..182 బిలియన్ సందేశాలను బ్లాక్ చేసిందని ట్రూకాలర్ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







