ఏపీ కరోనా అప్డేట్

- December 21, 2021 , by Maagulf
ఏపీ కరోనా అప్డేట్

ఏపీ: ఏపీలో గడిచిన 24 గంటల్లో 27,233 శాంపిల్స్‌ను పరీక్షించగా 95 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తాజా కేసులతో ఏపీలో ఇప్పటివరకు మొత్తం 20,75,974 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఒకరు (కృష్ణా జిల్లా) మరణించగా ఇప్పటివరకు మొత్తం మరణాల సంఖ్య 14,481కి చేరింది. నిన్న 179 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు 20,60,061 మంది కరోనా నుంచి కోలుకున్నారు.మరో వైపు రాష్ట్రంలో ఇంకా 1,432 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 26 కేసులు, గుంటూరు జిల్లాలో 15 కేసులు వెలుగు చూశాయి. కర్నూలు, విజయనగరం జిల్లాలలో కేసులేవీ నమోదు కాలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com