జీవితం రద్దవడం కంటే కార్యక్రమాలు రద్దవడమే మంచిది:WHO
- December 22, 2021
జెనీవా: మానవ సమాజం కరోనా పూర్వపు స్థితికి చేరుకుంటోందనుకుంటున్న తరుణంలో అకస్మాత్తుగా ముంచుకొచ్చిన ముప్పు ‘ఒమైక్రాన్’. ప్రస్తుతం ఐరోపా దేశాలు, అమెరికాలో ‘ఒమైక్రాన్’ ప్రబల కరోనా వేరియంట్గా రూపాంతరం చెందింది. ఇప్పటికే పలు ఐరోపా దేశాలు ఒమైక్రాన్ కట్టడి కోసం కఠిన ఆంక్షలకు తెరతీసాయి. అయితే.. క్రిస్మస్ సమీపిస్తుండటంతో పండగ మూడ్లోకి వెళ్లిపోయిన ప్రజలు.. కరోనా ఆంక్షల పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ విహారయాత్రలు, ఇతర వేడుకలు రద్దైపోయినందుకు చింతిస్తున్నారు.
ఈ పరిణామాం పలు దేశాల్లో రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. కరోనా ఆంక్షల పట్ల ప్రజల్లో గూడుకట్టుకున్న వ్యతిరేకత చూసి బెదిరిపోతున్న ప్రభుత్వాలు ఆంక్షలను మరింత కట్టుదిట్టం చేసేందుకు జంకుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అథానమ్ సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రయాణాలు, ఇతర కార్యక్రమాలు రద్దైపోతున్నందుకు ప్రజలు చింతించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. ‘‘జీవితం రద్దవడం కంటే..కార్యక్రమాలు రద్దైపోవడమే మంచిది’’ అని వ్యాఖ్యానించారు. సోమవారం జరిగిన ఓ పత్రికాసమావేశంలో టెడ్రోస్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు వేడుకలు చేసుకుని ఆ తరువాత చింతించడం కంటే కార్యక్రమాలను మరో రోజుకు వాయిదా వేసుకోవడమే మంచిదని ప్రజలకు సూచించారు.
తాజా వార్తలు
- తెలంగాణకు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది..
- ఏపీలో మూడు కొత్త జిల్లాలు
- 5.17 మిలియన్లకు పెరిగిన కువైట్ జనాభా..!!
- హైలే గోబీ వోల్కానో విస్ఫోటనం.. సౌదీ అరేబియా సేఫేనా?
- ఫ్రెండ్లీ వాతావరణంలో నిర్మాణాత్మక సంస్కరణలు..!!
- డిసెంబర్లో పెట్రోల్ ధరలు తగ్గుతాయా?
- ఖతార్తో గోవా పర్యాటక సంబంధాలు..!!
- అరేబియా సముద్రం పై వొల్కానిక్ యాష్..ఒమన్ అలెర్ట్..!!
- WTITC గ్లోబల్ ట్రేడ్ & ఇన్వెస్ట్మెంట్ వింగ్ సెక్రటరీగా శ్రీకాంత్ బడిగ నియామకం







