షహీన్ తుఫాను బాధితులకు బీమా డబ్బులు
- December 22, 2021
ఒమన్: షహీన్ తుఫాను కారణంగా నష్టపోయిన వారికి బీమా కంపెనీలు 62 మిలియన్ల రియాలకు పైగా పరిహారం చెల్లించాయి. షహీన్ తుఫాను బాధితుల కోసం బీమా క్లెయిమ్లలో 62 మిలియన్లు చెల్లించినట్లు క్యాపిటల్ మార్కెట్ అథారిటీ (CMA) తెలిపింది. మస్కట్, నార్త్ అండ్ సౌత్ బటినాలోని గవర్నరేట్లు తుఫాను కారణంగా తీవ్రంగా ప్రభావితమయ్యాయి. మొత్తం 9,800 కంటే ఎక్కువ క్లెయిమ్లు అప్లయ్ చేశారు. వాహనాలు, ఆస్తి నష్టంతో సహా ప్రకృతి వైపరీత్యాల ప్రమాదాలను కవర్ చేసే పాలసీల కోసం బీమా కంపెనీలకు చాలా క్లెయిమ్లు వచ్చినట్లు డేటాను బట్టి తెలుస్తోంది. దాదాపు 51 మిలియన్ల విలువైన రియాల క్లెయిమ్లు ఇప్పటికీ సెటిల్మెంట్లో ఉండగా.. దాదాపు 10 మిలియన్ల రియాల చెల్లింపులు జరిగాయని CMA తెలిపింది. ముఖ్యంగా గృహాలు, భవనాలు, ఆస్తుల నష్టం కోసం చెల్లించిన పరిహారం 45 మిలియన్లు మించిపోగా.. ఆ తర్వాత మోటారు ఇన్సూరెన్స్ కోసం 8.9 మిలియన్ రియాలు, ఇంజినీరింగ్ బీమా కింద 7.5 మిలియన్ రియాల పరిహారం కింద చెల్లించినట్లు CMA తన నివేదికలో వెల్లడించింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్లో తెలంగాణ వాసి మృతి







