షహీన్ తుఫాను బాధితులకు బీమా డబ్బులు
- December 22, 2021
ఒమన్: షహీన్ తుఫాను కారణంగా నష్టపోయిన వారికి బీమా కంపెనీలు 62 మిలియన్ల రియాలకు పైగా పరిహారం చెల్లించాయి. షహీన్ తుఫాను బాధితుల కోసం బీమా క్లెయిమ్లలో 62 మిలియన్లు చెల్లించినట్లు క్యాపిటల్ మార్కెట్ అథారిటీ (CMA) తెలిపింది. మస్కట్, నార్త్ అండ్ సౌత్ బటినాలోని గవర్నరేట్లు తుఫాను కారణంగా తీవ్రంగా ప్రభావితమయ్యాయి. మొత్తం 9,800 కంటే ఎక్కువ క్లెయిమ్లు అప్లయ్ చేశారు. వాహనాలు, ఆస్తి నష్టంతో సహా ప్రకృతి వైపరీత్యాల ప్రమాదాలను కవర్ చేసే పాలసీల కోసం బీమా కంపెనీలకు చాలా క్లెయిమ్లు వచ్చినట్లు డేటాను బట్టి తెలుస్తోంది. దాదాపు 51 మిలియన్ల విలువైన రియాల క్లెయిమ్లు ఇప్పటికీ సెటిల్మెంట్లో ఉండగా.. దాదాపు 10 మిలియన్ల రియాల చెల్లింపులు జరిగాయని CMA తెలిపింది. ముఖ్యంగా గృహాలు, భవనాలు, ఆస్తుల నష్టం కోసం చెల్లించిన పరిహారం 45 మిలియన్లు మించిపోగా.. ఆ తర్వాత మోటారు ఇన్సూరెన్స్ కోసం 8.9 మిలియన్ రియాలు, ఇంజినీరింగ్ బీమా కింద 7.5 మిలియన్ రియాల పరిహారం కింద చెల్లించినట్లు CMA తన నివేదికలో వెల్లడించింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?
- మహమ్మారి సమయంలో జన్మించిన పిల్లలకు అడ్మిషన్లు..!!
- గల్ఫ్ పెట్రో కెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీ యూనిట్ల పై దాడులు..!!









