ఏపీలో రెండో ఒమిక్రాన్ కేసు నమోదు
- December 22, 2021
ఏపీ:ఒమిక్రాన్ వేరియంట్ మన దేశంలో క్రమ క్రమంగా విజృంభిస్తూనే ఉంది.ఇప్పటికే మన దేశంలో 200 కు పైగా ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా.. ఏపీలో మరో ఒమిక్రాన్ కేసు వెలుగు చూసింది. కెన్యా నుంచి తిరుపతి వచ్చిన మహిళకు ఒమిక్రాన్ నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
39 ఏళ్ల సదరు మహిళ ఈ నెల 12 వ తేదీన కెన్యా నుంచి చెన్నై వచ్చారు. అక్కడి నుంచి తిరుపతి చేరుకున్న మహిళ నమూనాలను సేకరించి..జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపారు అధికారులు.అయితే ఆమెకు ఒమిక్రాన్ సోకినట్లు తాజాగా నిర్ధారణ అయింది. అయితే.. ఆ మహిళ కుటుంబ సభ్యుకు మాత్రం నెగిటివ్ వచ్చింది. కాగా..ఏపీలో తొలి ఒమిక్రాన్ కేసు విజయనగరం జిల్లాలో నమోదైన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్లో తెలంగాణ వాసి మృతి
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్కు? సమ్మర్ బ్రేక్కు ముందే క్లారిటీ..!!







