పెట్రోల్ స్టేషన్లలో 'డు' కియోస్క్లు
- March 25, 2016మై నెంబర్ మై ఐడెంటిటీ ప్రోగ్రామ్లో భాగంగా టెలికాం కంపెనీలు వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకోసం పలు ప్రాంతాల్లో తగిన ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రధానంగా మనీ ఎక్స్ఛేంజ్ ఔట్లెట్స్, కన్వీనియెంట్ స్టోర్స్ మరియు షాపింగ్ మాల్స్ తదితర ప్రాంతాల్లో ఈ సర్వీసుల్ని అందుబాటులోకి తెస్తున్నాయి. ఇక్కడ వినియోగదారులు రి-రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీలుంది. డు కంపెనీ వినియోగదారుల కోసం కియోస్క్లను ఇనోక్/ఎప్కో స్షేన్స్లో ఏర్పాటు చేసింది. వీటి నుంచి ఎమిరేట్స్ ఐడి లేదా పాస్పోర్ట్ విత్ వీసా పేజ్తో డు రి-రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని డు అధికారులు వెల్లడించారు. పలు ఔట్లెట్స్లో డు రి-రిజిస్ట్రేషన్ సౌకర్యాల్ని కల్పించామనీ, సిబ్బంది వైట్ మరియు బ్లూ యూనిఫామ్లో వుండి, వినియోగదారులకు అన్ని విధాలా సహకరిస్తారని డు వర్గాలు వెల్లడించాయి. కియోస్క్ల ద్వారా ప్రతిరోజూ 25 నుంచి 50 మంది వరకు రీ-రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారనీ, ఎక్కువమంది రిటైల్ ఔట్లెట్స్ని సంప్రదిస్తున్నారని వారు చెప్పారు.
తాజా వార్తలు
- జార్జియా: ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చిన 50 వేల మంది
- అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
- సౌదీలో BON TUM మయోనైజ్ పై నిషేధం
- రస్ అల్ ఖైమాలో గాయపడ్డ వ్యక్తి ఎయిర్లిఫ్ట్
- మే14 వరకు ‘మ్యాంగో మానియా’ మహోత్సవం
- విదేశీయుల నియామకం..రెస్టారెంట్ యజమానికి భారీ ఫైన్
- ఒమన్ను సందర్శించిన ప్రముఖ భారతీయ సామాజిక కార్యకర్తలు
- 'నిద్రపోతున్న' టీచర్ని ఫోటో తీసినందుకు Dh2000 జరిమానా
- ఏపీకి భారీ వర్షాల హెచ్చరిక..
- చిన్నారి మృతదేహాన్ని ఎయిర్పోర్ట్లో వదిలేసిన సిబ్బంది