సౌదీ అరేబియా వెళ్లేవారికి శుభవార్త..
- December 26, 2021
సౌదీ అరేబియా: మహమ్మారి కరోనా నేపథ్యంలో భారత్ ఇప్పటికే 30కి పైగా దేశాలతో ఎయిర్ బబుల్ ఒప్పందం చేసుకుంది. తాజాగా ఈ జాబితాలో సౌదీ అరేబియా చేరింది. దీంతో ఇరు దేశాల మధ్య అంతర్జాతీయ విమాన సర్వీసులకు లైన్ క్లియర్ అయింది. ఈ మేరకు సౌదీలోని ఇండియన్ ఎంబసీ ట్వీట్ చేసింది. ఈ ఒప్పందంలో భాగంగా 2022 జనవరి 1 నుంచి రెండు దేశాల మధ్య విమాన సర్వీసులు ప్రారంభం అవుతాయని తన ట్వీట్లో పేర్కొంది. ఇక ఎయిర్ బబుల్ ఒప్పందం ప్రకారం రెండు దేశాల మధ్య పరిమిత సంఖ్యలో డైరెక్ట్ విమాన సర్వీసులు నడిపించుకునేందుకు వీలు ఉంటుంది. కొన్ని ప్రత్యేక నిబంధనల మధ్య ఇరు దేశాలకు చెందిన ఎంపిక చేసిన విమానయాన సంస్థలు విమాన సర్వీసులు నడిపించుకోవచ్చు.
కాగా, భారత్ ఇప్పటికే 34 దేశాలతో ఎయిర్ బబుల్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ జాబితాలో ఆఫ్గనిస్థాన్, ఆస్ట్రేలియా, బహ్రెయిన్, బంగ్లాదేశ్, భూటాన్, కెనడా, ఇథియోపియా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇరాక్, జపాన్, కెన్యా, కువైత్, మాల్దీవులు, మారిషస్, నేపాల్, నెదర్లాండ్స్, నైజీరియా, ఒమన్, ఖతార్, రష్యా, రువాండా, సింగపూర్, సీషెల్స్, స్విట్జర్లాండ్, శ్రీలంక, టాంజానియా, యూఏఈ, యూకే, అమెరికా, ఉక్రెయిన్, ఉజ్బెకిస్తాన్, సౌదీ అరేబియా ఉన్నాయి.
ఇక తాజాగా కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్ వణికిస్తున్న వేళ సౌదీ అరేబియాతో భారత్ ఎయిర్ బబుల్ ఒప్పందం చేసుకోవడం ఇరు దేశాల ప్రయాణికులకు కొంత ఉపశమనం కలిగించే విషయం. ముఖ్యంగా ఉమ్రా యాత్రికులు, భారత ప్రవాసులకు బిగ్ రిలీఫ్ అని చెప్పాలి.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి