ఖతార్ మంత్రి మండలి: ఫేస్ మాస్కులు అన్ని చోట్లా తప్పనిసరి
- December 30, 2021
దోహా: బహిరంగ ప్రదేశాల్లో ఫేస్ మాస్క్ తప్పనిసరి నిబంధనను కొన్నాళ్ళ క్రితమే తొలగించగా, తిరిగి దాన్ని తప్పనిసరి చేస్తూ ఖతార్ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. అమిరి దివాన్ వద్ద జరిగిన మంత్రి మండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో అలాగే, మూసివున్న ప్రాంతాల్లో కూడా ఫేస్ మాస్క్ ధరించడం తప్పనిసరి. అయితే, బహిరంగ ప్రదేశాల్లో ప్రాక్టీస్ చేసే క్రీడాకారులకు వెసులుబాటు కల్పించారు. ఒమిక్రాన్ మరియు డెల్టా వేరియంట్ కోవిడ్ 19 కేసులు పెరుగుతున్న దరిమిలా ీ నిర్ణయం తీసుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఎగ్జిబిషన్లు వంటి చోట్ల 75 శాతం సామర్థ్యానికే అనుమతి. అదే, ఇండోర్ ఎగ్జిబిషన్లు వంటివాటిల్లో 50 శాతం సామర్థ్యానికే అనుమతి. వ్యాక్సినేషన్ పూర్తయినవారికి లేదా పీసీఆర్ నెగెటివ్ సర్టిఫికెట్ వున్నవారికి మాత్రమే అనుమతి లభిస్తుంది.
తాజా వార్తలు
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్లో తెలంగాణ వాసి మృతి
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్కు? సమ్మర్ బ్రేక్కు ముందే క్లారిటీ..!!







