ఖతార్ మంత్రి మండలి: ఫేస్ మాస్కులు అన్ని చోట్లా తప్పనిసరి
- December 30, 2021
దోహా: బహిరంగ ప్రదేశాల్లో ఫేస్ మాస్క్ తప్పనిసరి నిబంధనను కొన్నాళ్ళ క్రితమే తొలగించగా, తిరిగి దాన్ని తప్పనిసరి చేస్తూ ఖతార్ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. అమిరి దివాన్ వద్ద జరిగిన మంత్రి మండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో అలాగే, మూసివున్న ప్రాంతాల్లో కూడా ఫేస్ మాస్క్ ధరించడం తప్పనిసరి. అయితే, బహిరంగ ప్రదేశాల్లో ప్రాక్టీస్ చేసే క్రీడాకారులకు వెసులుబాటు కల్పించారు. ఒమిక్రాన్ మరియు డెల్టా వేరియంట్ కోవిడ్ 19 కేసులు పెరుగుతున్న దరిమిలా ీ నిర్ణయం తీసుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఎగ్జిబిషన్లు వంటి చోట్ల 75 శాతం సామర్థ్యానికే అనుమతి. అదే, ఇండోర్ ఎగ్జిబిషన్లు వంటివాటిల్లో 50 శాతం సామర్థ్యానికే అనుమతి. వ్యాక్సినేషన్ పూర్తయినవారికి లేదా పీసీఆర్ నెగెటివ్ సర్టిఫికెట్ వున్నవారికి మాత్రమే అనుమతి లభిస్తుంది.
తాజా వార్తలు
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. నేపాల్కు భారత్ రెస్క్యూ బృందాల సహకారం
- అబుదాబిలో ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ మహమ్మద్
- యూఏఈలో అనధికార ఆన్లైన్ ఫత్వా ఖాతాల పై చర్యలు..
- సెంచరీతో చెలరేగిన డీజీపీ సీవీ ఆనంద్..
- యూఏఈలో పర్సనల్ లోన్ చెల్లింపులు నిలిచిపోతే ఏమవుతుంది?
- దుబాయ్ ఎయిర్పోర్టులో కొత్త స్కానర్లు..
- భారతీయులకు ఉజ్బెకిస్తాన్ బంపరాఫర్..
- మసందమ్లో కొత్త రహదారి..ఖసబ్-దిబ్బా ప్రయాణ సమయం 55 నిమిషాలకు తగ్గింపు
- హైదరాబాద్ లో అతిపెద్ద క్రికెట్ స్టేడియం..
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం







