భారత్‌లో కోవిడ్‌ విజృంభన...

- December 31, 2021 , by Maagulf
భారత్‌లో కోవిడ్‌ విజృంభన...

న్యూ ఢిల్లీ:  భారత్‌లో రోజురోజుకు కోవిడ్‌ విజృంభన పెరిగిపోతోంది.నిన్నటి వరకు 13 వేల వరకు నమోదైన కేసులు నేడు అనుహ్యంగా 16,764 కేసులు నమోదయ్యాయి.దీంతో పాటు గడిచిన 24 గంటల్లో 220 మంది కరోనా బారినపడి మృతి చెందారు.దీనితో పాటు తాజాగా 7,585 మంది కరోనా నుంచి కొలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. కరోనా నేపథ్యంలో ఇప్పటి కేసులు రాష్ట్రాలు కోవిడ్‌ ఆంక్షలను తీవ్రతరం చేశారు.

అంతేకాకుండా ప్రతి ఒక్కరూ కరోనా కట్టడికి రెండు డోసులు కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ సూచిస్తోంది. ఇదిలా ఉండగా.. న్యూ ఇయర్‌ వేడుకలు నేడు జరుగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఈవెంట్లలో, పబ్‌లలో ఎక్కువగా మంది గుమిగూడడం తప్పదు. దీంతో కరోనా కేసులు మరింత ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com