దుబాయ్ ఎయిర్పోర్ట్లలో పీక్ ట్రావెల్ అలర్ట్...
- December 31, 2021
దుబాయ్: దుబాయ్ ఎయిర్పోర్ట్లలో పీక్ ట్రావెల్ అలర్ట్ కొనసాగుతుంది. దీంతో దుబాయ్ ఇంటర్నేషనల్ (డిఎక్స్బి)లోని టెర్మినల్స్లోకి టిక్కెట్ ఉన్న ప్రయాణీకులు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. డిసెంబరు 29, 2021, జనవరి 8, 2022 మధ్య సుమారు 2 మిలియన్ల మంది ప్రయాణికులువయా దుబాయ్ వెళతారని అంచనా. ప్రస్తుతం రోజువారీ ఏవరేజ్ ట్రాఫిక్ 178,000 మంది ప్రయాణికులను మించిపోయింది. ప్రస్తుత సెలవు సీజన్లో జనవరి 2న 198,000 కంటే ఎక్కువ మంది ప్రయాణికులు ఉంటారని అంచనా వేస్తున్నారు. దుబాయ్ ఎయిర్పోర్ట్స్లోని టెర్మినల్ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ ఎస్సా అల్ షమ్సీ మాట్లాడుతూ.. కొవిడ్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో బంధువులకు, స్నేహితులకు ఎయిర్ పోర్ట్ కు రాకుండా ఇంట్లోనే వీడ్కోలు చెప్పమని సలహా ఇచ్చారు. ఇలా చేయడం వల్ల ఎయిర్ పోర్ట్ చుట్టుపక్కల రద్దీ తగ్గడంతో పాటు ప్రయాణాన్ని సురక్షితంగా మార్చుతుందని ఆయన సూచించారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి