ఒకే ఏడాది 18వేల మంది ప్రవాసులను బహిష్కరించిన కువైట్
- January 02, 2022
కువైట్ సిటీ: కువైట్ గత కొంతకాలంగా ప్రవాసుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత ఏడాది వివిధ ఉల్లంఘనలకు పాల్పడిన 18వేలకు పైగా మందిని దేశం నుంచి బహిష్కరించింది. ఆ దేశ అంతర్గత మంత్రిత్వశాఖ వెల్లడించిన తాజా నివేదిక ప్రకారం 2021లో మొత్తం 18,221 మంది ప్రవాసులను దేశం నుంచి బహిష్కరించినట్లు తెలిసింది. వీరందరూ వలసదారుల విషయమై చేసిన వివిధ చట్టాలను ఉల్లంఘించినట్లు మంత్రిత్వశాఖ తన నివేదికలో పేర్కొంది. ఇక దేశ బహిష్కరణకు గురైన 18,221 మంది ప్రవాసుల్లో 11,177 మంది పురుషులు, 7,044 మంది మహిళలు ఉన్నారు. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలను వేగవంతం చేసేందుకు అధికార యంత్రాంగం సూచనల మేరకు బహిష్కరణకు పాల్పడినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని పబ్లిక్ రిలేషన్స్ అండ్ సెక్యూరిటీ మీడియా జనరల్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది.
తాజా వార్తలు
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్లో తెలంగాణ వాసి మృతి







