ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త...
- March 25, 2016
ఈ ఏడాది 20వేల పోస్టులను భర్తీ చేస్తామని ప్రభుత్వం 2016-17 బడ్జెట్లో వెల్లడించిన విషయం తెల్సిందే. అందులో భాగంగా తొలిదశ కింద 7వేల పోస్టులు భర్తీ చేయడానికి ఆర్థికశాఖ ప్రతిపాదనలు తయారు చేసి ఈనెల 18న జరిగిన మంత్రివర్గం సమావేశం ముందుంచింది. అయితే ఆరోజు సమయాభావం కారణంగా ఈ అంశంపై చర్చించలేదని తెలిసింది. వచ్చే సమావేశంలో దీనిపై విధాన నిర్ణయం తీసుకుని భర్తీకి చర్యలు తీసుకోనున్నట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర ప్రభుత్వంలోని మొత్తం పోస్టుల సంఖ్య దాదాపు 4.50 లక్షలు కాగా అందులో 80 వేల దాకా ఖాళీలున్నట్లు సమాచారం. ఇందులో అత్యధికభాగం 4వ తరగతి ఉద్యోగులవేనని అధికారవర్గాలు తెలిపాయి. గ్రూప్ 1, గ్రూప్ 2, డాక్టర్లు, వైద్య ఆరోగ్య సిబ్బంది, అధ్యాపకుల్లాంటి ఉన్నతస్థాయి పోస్టులు దాదాపు 20 వేల దాకా ఖాళీగా ఉన్నట్లు అంచనాకు వచ్చారు.ఇందులో 7వేల పోస్టులను తొలి దశలో భర్తీ చేయడానికి ప్రభుత్వం సమాయత్తమవుతోంది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పదవీ విరమణ వయస్సును పెంచడంతో గత రెండేళ్లలో రిటైర్మెంట్లు ఆగిపోయాయి. పెంచిన గడువు ఈ యేడాది జూన్ 8తో ముగియనుంది. ఆ తర్వాత సుమారు 10 వేల మంది ఉద్యోగులు రిటైర్ కాబోతున్నట్లు ఉన్నతస్థాయి అధికార వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







