ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త...
- March 25, 2016
ఈ ఏడాది 20వేల పోస్టులను భర్తీ చేస్తామని ప్రభుత్వం 2016-17 బడ్జెట్లో వెల్లడించిన విషయం తెల్సిందే. అందులో భాగంగా తొలిదశ కింద 7వేల పోస్టులు భర్తీ చేయడానికి ఆర్థికశాఖ ప్రతిపాదనలు తయారు చేసి ఈనెల 18న జరిగిన మంత్రివర్గం సమావేశం ముందుంచింది. అయితే ఆరోజు సమయాభావం కారణంగా ఈ అంశంపై చర్చించలేదని తెలిసింది. వచ్చే సమావేశంలో దీనిపై విధాన నిర్ణయం తీసుకుని భర్తీకి చర్యలు తీసుకోనున్నట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర ప్రభుత్వంలోని మొత్తం పోస్టుల సంఖ్య దాదాపు 4.50 లక్షలు కాగా అందులో 80 వేల దాకా ఖాళీలున్నట్లు సమాచారం. ఇందులో అత్యధికభాగం 4వ తరగతి ఉద్యోగులవేనని అధికారవర్గాలు తెలిపాయి. గ్రూప్ 1, గ్రూప్ 2, డాక్టర్లు, వైద్య ఆరోగ్య సిబ్బంది, అధ్యాపకుల్లాంటి ఉన్నతస్థాయి పోస్టులు దాదాపు 20 వేల దాకా ఖాళీగా ఉన్నట్లు అంచనాకు వచ్చారు.ఇందులో 7వేల పోస్టులను తొలి దశలో భర్తీ చేయడానికి ప్రభుత్వం సమాయత్తమవుతోంది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పదవీ విరమణ వయస్సును పెంచడంతో గత రెండేళ్లలో రిటైర్మెంట్లు ఆగిపోయాయి. పెంచిన గడువు ఈ యేడాది జూన్ 8తో ముగియనుంది. ఆ తర్వాత సుమారు 10 వేల మంది ఉద్యోగులు రిటైర్ కాబోతున్నట్లు ఉన్నతస్థాయి అధికార వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









