కోవిడ్ అంతమయ్యేది అప్పుడే: WHO చీఫ్
- January 03, 2022
జెనీవా: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి పీడ ఇంకా కొనసాగుతుంది. 2019లో చైనాలో ప్రారంభమైన మహమ్మారి ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమందిపై ప్రభావం చూపింది. దేశాలకు దేశాలు కరోనాను చూసి గజగజలాడిపోయాయి. మహమ్మారితో ప్రయాణం రెండు సంవత్సరాలు దాటి మూడో ఏడాదిలోకి అడుగుపెట్టింది. ఈఏడాది చివరి నాటికి మహమ్మారి అంతమయ్యే అవకాశం ఉందంటూ వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ WHO చీఫ్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రేయేసస్ వెల్లడించారు. ఈక్రమంలో 2022 నూతన సంవత్సరం సందర్భంగా టెడ్రోస్ పలు కీలక వ్యాఖ్యలు చేసారు.
ప్రపంచానికి మహమ్మారి నుంచి ఈఏడాది విముక్తి కలగాలంటే.. ముందు మనందరిలో “అసమానతలు” తొలగిపోవాలని టెడ్రోస్ వ్యాఖ్యానించారు. ప్రజల్లో అసమానతల కారణంగా సుహృద్భావం తగ్గిపోయిందని తద్వారా, ఇటువంటి విపత్తుల సమయంలో కొందరు ప్రజలు సహాయం పొందలేకపోతున్నారని టెడ్రోస్ ఆవేదన వ్యక్తం చేసారు. ప్రజలందరూ తనామనా తారతమ్యాలు లేకుండా ప్రతి ఒక్కరి గురించి ఆలోచించిననాడే కరోనా వంటి విపత్తుల నుంచి మనల్సి మనం రక్షించుకోగలమని టెడ్రోస్ పేర్కొన్నారు. కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు సాధారణ టీకాలు తీసుకోలేకపోయారని, ఇతర వ్యాధులకు చికిత్సనూ కోల్పోయారని టెడ్రోస్ తెలిపారు.
కలిసికట్టుగా ప్రజలందరూ సహకారం అందించుకుని టీకాలు వేయించుకుంటేనే కరోనా వంటి మహమ్మారుల నుంచి రక్షణ పొందగలమని టెడ్రోస్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. భవిష్యత్ లో మరింత ప్రభావవంతమైన వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నా, వాటికీ మనం సిద్ధంగా లేకపోతే మానవాళికి పెను ముప్పు వాటిల్లుతుందని టెడ్రోస్ తెలిపారు. కావున ప్రజలంతా అసమానతలు వీడి స్నేహపూర్వకంగా ఉండాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!









