ఆన్‌లైన్ నిధుల బదిలీ స్కామ్: మరింత మంది బాధితులు

- January 03, 2022 , by Maagulf
ఆన్‌లైన్ నిధుల బదిలీ స్కామ్: మరింత మంది బాధితులు

బహ్రెయిన్: ఆన్‌లైన్ పేమెంట్ బదిలీ స్కామ్ బాధితులు మరింతమంది సోషల్ మీడియా వేదికగా తమ సమస్యల్ని వెల్లగక్కుతున్నారు. స్కామర్లు పంపిన ఓ ఎస్ఎంఎస్‌కి అనుగుణంగా కాల్ చేయడంతో 1,000 బహ్రెయినీ దినార్లు కోల్పోయినట్లు ఓ బాధితురాలు పేర్కొన్నారు. మరో బాధితులు 1,500 బహ్రెయినీ దినార్లు కోల్పోవడం జరిగింది. కాగా, పలువురు బాధితులు ఇలాంటి సందర్భాల్లో పోలీసుల్ని ఆశ్రయిస్తున్నారు. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ విషయంలో మరిన్ని భద్రతా చర్యలు అవసరమని సైబర్ సెక్యూరిటీ నిపుణులు చెబుతున్నారు. అయితే, అనుమానాస్పద కాల్స్ పట్ల అప్రమత్తంగా వుండాలనీ, స్కామర్లు పంపే మెసేజ్‌లకు స్పందించరాదని వారు సూచించడం జరుగుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com