బహ్రెయిన్-భారత్ దౌత్య సంబంధాలను పరిచయం చేసే డాక్యూమెంటరీ విడుదల
- January 07, 2022
మనామా: బహ్రెయిన్ మరియు భారతదేశం దౌత్య సంబంధాలు 50 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా వివిధ అంశాలను వివరిస్తూ ఒక డాక్యుమెంటరీ తీయడం జరిగింది.బహ్రెయిన్ లోని నవభారత్ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన 'గోల్డెన్ గ్లిమ్ప్స్' కార్యక్రమంలో ఈ డాక్యూమెంటరీని విడుదల చేయడం జరిగింది.
ట్రేడ్, కామర్స్, ఎడ్యుకేషన్, ఆరోగ్యం, నిర్మాణ మరియు పర్యాటక రంగం వంటి వివిధ రంగాలలో 50 సంవత్సరాలుగా ఇరు దేశాల మధ్య జరిగిన అభివృద్ధి అంశాలపై ఈ డాక్యుమెంటరీ తీయడం జరిగింది.
'గోల్డెన్ గ్లిమ్ప్స్' కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బహ్రెయిన్ భారత రాయబారి పీయూష్ శ్రీవాత్సవ విచ్చేయటం జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ మంత్రిత్వ శాఖల అధికారులు, బహ్రెయిన్ లోని పలు కంపెనీల అధిపతులు పాల్గొన్నారు. "ఇరు దేశాల సంస్కృతీ, వ్యాపార రంగాల అభివృద్ధి కళ్ళకు కట్టినట్టుగా తీసిన ఈ డాక్యుమెంటరీ వచ్చే తరాలకు కూడా దిక్సూచిగా ఉంటుంది" అని భారత రాయబారి ఆశాభావం వ్యక్తం చేశారు. నవభారత్ సంస్థ అధ్యక్షులు డాక్టర్ పి.వి రెడ్డి మాట్లాడుతూ "మేము చేసిన ఈ చిరు ప్రయత్నం బహ్రెయిన్ లోని ప్రవాసీయుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని తీసినది. ఈ కార్యక్రమంలో మాకు సహాయసహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు" అని అన్నారు.
నవభారత్ సంస్థ అధ్యక్షులు డాక్టర్ పి.వి రెడ్డి, జనరల్ సెక్రటరీ ప్రదీప్ కుమార్ మరియు కార్యవర్గ సభ్యులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)




తాజా వార్తలు
- వాట్సాప్లోనే ఈ-ఆధార్ డౌన్లోడ్.. కొత్త సర్వీస్!
- హర్మూజ్ జలసంధిని తెరవాలని ఇరాన్కు 20 దేశాల విజ్ఞప్తి
- ఫ్యామిలీ డెంటల్ ప్యాకేజీలు ప్రారంభించిన మెడికవర్ హాస్పిటల్స్
- యూఏఈలో అస్థిర వాతావరణం..అబుదాబి, దుబాయ్లలో వర్షాలు..!!
- ఆసుపత్రులను తనిఖీ చేసిన హెల్త్ మినిస్టర్..!!
- ఇరాన్ దాడులు..బహ్రెయిన్ వ్యాప్తంగా సంఘీభావం వ్యక్తం..!!
- సౌదీ అరేబియాలో స్ప్రింగ్ సీజన్ ప్రారంభం..!!
- కన్షుమర్ స్పెండింగ్ పాటర్న్ ని హైలెట్ చేసిన ఈద్..!!
- మాతృ దినోత్సవం..శుభాకాంక్షలు తెలిపిన ఒమన్ మహారాణి..!!
- ఇన్విజిలేటర్ల ఫోన్లపై నిషేధం..పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ట్రాకింగ్









