బహ్రెయిన్-భారత్ దౌత్య సంబంధాలను పరిచయం చేసే డాక్యూమెంటరీ విడుదల
- January 07, 2022
మనామా: బహ్రెయిన్ మరియు భారతదేశం దౌత్య సంబంధాలు 50 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా వివిధ అంశాలను వివరిస్తూ ఒక డాక్యుమెంటరీ తీయడం జరిగింది.బహ్రెయిన్ లోని నవభారత్ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన 'గోల్డెన్ గ్లిమ్ప్స్' కార్యక్రమంలో ఈ డాక్యూమెంటరీని విడుదల చేయడం జరిగింది.
ట్రేడ్, కామర్స్, ఎడ్యుకేషన్, ఆరోగ్యం, నిర్మాణ మరియు పర్యాటక రంగం వంటి వివిధ రంగాలలో 50 సంవత్సరాలుగా ఇరు దేశాల మధ్య జరిగిన అభివృద్ధి అంశాలపై ఈ డాక్యుమెంటరీ తీయడం జరిగింది.
'గోల్డెన్ గ్లిమ్ప్స్' కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బహ్రెయిన్ భారత రాయబారి పీయూష్ శ్రీవాత్సవ విచ్చేయటం జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ మంత్రిత్వ శాఖల అధికారులు, బహ్రెయిన్ లోని పలు కంపెనీల అధిపతులు పాల్గొన్నారు. "ఇరు దేశాల సంస్కృతీ, వ్యాపార రంగాల అభివృద్ధి కళ్ళకు కట్టినట్టుగా తీసిన ఈ డాక్యుమెంటరీ వచ్చే తరాలకు కూడా దిక్సూచిగా ఉంటుంది" అని భారత రాయబారి ఆశాభావం వ్యక్తం చేశారు. నవభారత్ సంస్థ అధ్యక్షులు డాక్టర్ పి.వి రెడ్డి మాట్లాడుతూ "మేము చేసిన ఈ చిరు ప్రయత్నం బహ్రెయిన్ లోని ప్రవాసీయుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని తీసినది. ఈ కార్యక్రమంలో మాకు సహాయసహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు" అని అన్నారు.
నవభారత్ సంస్థ అధ్యక్షులు డాక్టర్ పి.వి రెడ్డి, జనరల్ సెక్రటరీ ప్రదీప్ కుమార్ మరియు కార్యవర్గ సభ్యులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)




తాజా వార్తలు
- మిడిలీస్టు ఉద్రిక్తతలతో చమురు ధరలు పెరుగుదల..గోల్డ్ ధరలు తగ్గుదల..!!
- ఖతార్ లో కార్మిక మంత్రిత్వ శాఖ ఈ-సేవలు కొనసాగింపు..!!
- కుటుంబ సభ్యుల పుట్టిన తేదీలతో.. Dh30 మిలియన్ల జాక్పాట్ కొట్టిన భారతీయ ప్రవాసి..!!
- కువైట్లో ప్రైవేట్ ఆస్పత్రుల్లో నగదు చెల్లింపులపై కొత్త నిబంధనలు..!!
- సౌదీలో విజిట్ వీసా గడువు దాటితే 50 వేల రియాల్స్ ఫైన్, జైలుశిక్ష..!!
- యూఏఈలో అమెరికా కాన్సులర్ సేవలునిలిపివేత..!!
- రాయల్ హ్యూమానిటేరియన్ ఫౌండేషన్ కు 25 ఏళ్లు..!!
- హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు మరో అంతర్జాతీయ అవార్డు
- దమ్మామ్–రియాద్ ఎక్స్ప్రెస్వే విస్తరణకు శ్రీకారం..
- దుబాయ్ పోలీసుల 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం నాలుగో వారానికి చేరిక..







