శ్రీవారి భక్తులకు శుభవార్త...
- January 08, 2022
తిరుమల: శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. గత ఏడాది భారీ వర్షాల కారణంగా తిరుమల దర్శనానికి బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చాలామంది భక్తులు స్వామి వారిని దర్శించుకునే భాగ్యం కలగలేదు. దీంతో దర్శనం టోకెన్లు తీసుకున్న భక్తులు నిరాశకు లోనయ్యారు. ఈ క్రమంలో అప్పుడు స్వామి వారి దర్శనం చేసుకోని వారికి తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. మళ్లీ దర్శనం చేసుకోవచ్చని వెల్లడించింది. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేసింది. నవంబరు 18 నుంచి డిసెంబరు 10వ తేదీ వరకు టికెట్లు కలిగి దర్శనం చేసుకోలేకపోయిన భక్తుల వినతి మేరకు టీటీటీ వారికి ఆరు నెలల్లోపు స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం కల్పించింది.
అయితే తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 13 నుండి 22వ తేదీ వరకు వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల సందర్భంగా ఆ టికెట్లపై అనుమతి ఉండదని ప్రకటించింది. వైకుంఠ ద్వార దర్శనం కారణంగా ఈ తేదీలు మినహాయించి వారు మరి ఏ తేదీల్లోనైనా శ్రీవారి దర్శనం చేసుకోవచ్చని టీటీటీ తెలిపింది. కావున భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ అధికారులు తెలిపారు. ఈ మేరకు టీటీడీ ప్రజాసంబంధాల అధికారి ప్రకటన విడుదల చేశారు.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









