తెలంగాణలో కరోనా కేసుల వివరాలు
- January 08, 2022
హైదరాబాద్: తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజురోజుకీ పెరుగుతోన్న కేసులు భయాందోళనలను గురి చేస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు 2వేల మార్కును దాటేశాయి. ఇక తాజాగా గడిచిన 24 గంటల్లో ఏకంగా 2,606 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వరుసగా రెండు వేలకు పైగా కేసులు నమోదు కావడం ఇది రెండో రోజు. వైద్య, ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్లో వివరాల ప్రకారం 24 గంటల్లో 285 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ సంఖ్య 6,92,357కు పెరిగింది. ఇందులో 6,76,136 మంది బాధితులు కోలుకున్నారు. వైరస్ కారణంగా మొత్తం 4,041 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మరణాల రేటు 0.58శాతంగా ఉందని, రికవరీ రేటు 97.65 శాతంగా అధికారులు తెలిపారు. ప్రస్తుతం 12,180 యాక్టివ్ కేసులున్నాయని, ఇవాళ ఒకే రోజు 73,156 టెస్టులు నిర్వహించినట్లు వివరించింది. కొత్త కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 1,583 కేసులు రికార్డయ్యాయి. అలాగే రంగారెడ్డిలో 214 కేసులు, మేడ్చల్లో మరో 292 మందికి కరోనా పాజిటివ్గా తేలింది.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







