షార్జా వెళ్లే విమానప్రయాణికులకు శుభవార్త!
- January 10, 2022
న్యూఢిల్లీ: భారతీయ బడ్జెట్ ఎయిర్లైన్ స్పైస్జెట్ షార్జా వెళ్లేవారికి గుడ్న్యూస్ చెప్పింది. భారత్లోని మూడు నగరాల నుంచి షార్జాలకు విమాన సర్వీసులు ప్రారంభించింది. జనవరి 7 నుంచి పుణే, మదురై, మంగళూరు నుంచి షార్జాకు విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి.ఇక ఈ మూడు నగరాల నుంచి షార్జాకు వెళ్లే విమాన సర్వీసుల షెడ్యూల్ వివరాలను పరిశీలిస్తే..
- పుణే టు షార్జా: డైలీ రాత్రి 9.05 గంటలకు విమానం బయల్దేరుతుంది. షార్జా విమానాశ్రయానికి రాత్రి 11.10 గంటలకు చేరుకుంటుంది.
- మదురై టు షార్జా: వీక్లీ నాలుగు సర్వీసులు మాత్రమే. సోమ, మంగళ, గురు, శనివారాల్లో మదురై నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు బయల్దేరే విమానం షార్జాకు మధ్యాహ్నం 3.30 గంటలకు చేరుతుంది.
- మంగళూరు టు షార్జా: వారంలో నాలుగు సర్వీసులు. సోమ, మంగళ, గురు, శనివారాల్లో మదురై నుంచి రాత్రి 10.30 గంటలకు బయల్దేరే విమానం షార్జాకు తెల్లవారుజామున 12.55 గంటలకు చేరుకుంటుంది. ఇలా స్పైస్జెట్ ఈ మూడు నగరాల నుంచి వారానికి మొత్తం 15 విమాన సర్వీసులు నడపనుంది.ఇక పుణే విమానాశ్రయం నుంచి దాదాపు రెండేళ్ల తర్వాత తొలి అంతర్జాతీయ విమానం జనవరి 7న వెళ్లింది.
తాజా వార్తలు
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్లో తెలంగాణ వాసి మృతి







