షార్జా వెళ్లే విమానప్రయాణికులకు శుభవార్త!
- January 10, 2022
న్యూఢిల్లీ: భారతీయ బడ్జెట్ ఎయిర్లైన్ స్పైస్జెట్ షార్జా వెళ్లేవారికి గుడ్న్యూస్ చెప్పింది. భారత్లోని మూడు నగరాల నుంచి షార్జాలకు విమాన సర్వీసులు ప్రారంభించింది. జనవరి 7 నుంచి పుణే, మదురై, మంగళూరు నుంచి షార్జాకు విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి.ఇక ఈ మూడు నగరాల నుంచి షార్జాకు వెళ్లే విమాన సర్వీసుల షెడ్యూల్ వివరాలను పరిశీలిస్తే..
- పుణే టు షార్జా: డైలీ రాత్రి 9.05 గంటలకు విమానం బయల్దేరుతుంది. షార్జా విమానాశ్రయానికి రాత్రి 11.10 గంటలకు చేరుకుంటుంది.
- మదురై టు షార్జా: వీక్లీ నాలుగు సర్వీసులు మాత్రమే. సోమ, మంగళ, గురు, శనివారాల్లో మదురై నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు బయల్దేరే విమానం షార్జాకు మధ్యాహ్నం 3.30 గంటలకు చేరుతుంది.
- మంగళూరు టు షార్జా: వారంలో నాలుగు సర్వీసులు. సోమ, మంగళ, గురు, శనివారాల్లో మదురై నుంచి రాత్రి 10.30 గంటలకు బయల్దేరే విమానం షార్జాకు తెల్లవారుజామున 12.55 గంటలకు చేరుకుంటుంది. ఇలా స్పైస్జెట్ ఈ మూడు నగరాల నుంచి వారానికి మొత్తం 15 విమాన సర్వీసులు నడపనుంది.ఇక పుణే విమానాశ్రయం నుంచి దాదాపు రెండేళ్ల తర్వాత తొలి అంతర్జాతీయ విమానం జనవరి 7న వెళ్లింది.
తాజా వార్తలు
- తెలంగాణ బడ్జెట్ రూ.3,24,234 కోట్లు..
- రికార్డు స్థాయిలో కుప్పకూలిన రూపాయి విలువ
- అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో కొత్త ట్విస్ట్..!
- పట్టాభి సీతారామయ్య స్మారక భవనానికి అనుమతులు మంజూరు: ఎంపీ బాలశౌరి
- భారతీయులకు ఎఫెక్ట్..వీసా ఫీజులు పెంచిన యూకే
- తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ శుభవార్త
- ప్రపంచ శాంతి, స్థిరత్వానికి మద్దతు సౌదీ కొనసాగిస్తుంది..కింగ్ సల్మాన్
- యూఏఈలో భారీ వర్షాలు, ఉరుములు, వడగళ్ల వాన కురిసే అవకాశం..!!
- ఖతార్ లో ఉరుములతో కూడిన వర్షం, బలమైన గాలులు..!!
- పౌరులకు, నివాసితులకు ఈద్ శుభాకాంక్షలు తెలిపిన సుల్తాన్..!!









