పట్టాలెక్కనున్న ఖతార్- సౌదీ రైల్వే లైన్..!
- January 10, 2022
దోహా: GCC సంక్షోభానికి ముగింపు తెచ్చిన అల్-ఉల్లా డిక్లరేషన్పై సంతకం చేసిన ఒక సంవత్సరం తర్వాత ఖతార్, సౌదీ అరేబియా మధ్య సంబంధాలు శరవేగంగా బలపడుతున్నట్లు, అభివృద్ధి చెందుతున్నట్లు కనిపిస్తోంది. రెండు దేశాలకు చెందిన రవాణా మంత్రులు గత వారం దోహాలో సమావేశమయ్యారు. ఈ సంధర్భంగా రెండు దేశాలను కలిపే రైలు లైన్ ఏర్పాటుపై చర్చించారు. ఖతార్ రవాణా మంత్రి జాసిమ్ అల్-సులైతి, సౌదీ మంత్రి సలేహ్ బిన్ నాసర్ అల్-జాసర్ దీనిపై చర్చలు జరిపారు. దీంతో పాటు రవాణా, పౌర విమానయానం, ఓడరేవులు, అలాగే రైల్వే రంగాలలో సహకారం యొక్క అంశాలకు సంబంధించి కూడా వారు చర్చించారు. అనంతరం ఇద్దరు మంత్రులు ఇతర అధికారులతో కలిసి దోహా మెట్రో ప్రాజెక్ట్ను కూడా సందర్శించారు. అక్కడ వారికి ఖతార్ రైల్వేస్ కంపెనీ అధికారులు ప్రాజెక్ట్ యొక్క విశేషాలను వివరించారు. ప్రతిపాదిత రైలు లింక్ ప్రాజెక్ట్ రెండు దేశాల మధ్య దౌత్య సంక్షోభం కారణంగా 2016లో రద్దు చేశారు. ఖతార్ యూనివర్శిటీ యొక్క ఇబ్న్ ఖల్డాన్ సెంటర్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అలీ బాకీర్ మాట్లాడుతూ.. GCC రాష్ట్రాల మధ్య ఏకీకరణ, అంతర్ సంబంధాన్ని ఈ ప్రాజెక్ట్ మరింతగా ముందుకు తీసుకు పోతుందన్నారు. రాజకీయ వివాదాల కారణంగా తలెత్తే నష్టం గురించి 2017 గల్ఫ్ సంక్షోభం చూపించింది. ఇప్పుడు అలాంటి సంక్షోభం లేనందున, ఇటువంటి ప్రాజెక్టులను పునఃప్రారంభించే అవకాశం ఉందన్నారు. ఖతార్, సౌదీ అరేబియా మధ్య ఉన్న సాల్వా సరిహద్దు ద్వారా ప్రతి వారం వేల మంది ప్రజలు ప్రయాణాలు చేస్తారు. బంధువులను చూసేందుకు, ఉమ్రా లేదా హజ్ తీర్థయాత్రలను చేసేందుకు వెళుతుంటారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







