అపహరించి....ఆపై వారికే బేరం పెట్ట్జిన ఘరానా రూంమేట్
- March 26, 2016
బంగ్లాదేశ్ కు చెందిన ఒక వ్యక్తికి దోహా నేర న్యాయస్థానం ఒక సంవత్సరం కారాగారం విధించినట్లు స్థానిక అరబిక్ డైలీ ఆర్రయహ్ శుక్రవారం నివేదించారు. ఈ బంగ్లాదేశ్ నిందితుడు తన రూంమేట్ల వద్ద దొంగతనానికి పాల్పడ్డాడు.వారి వద్ద నుంచి 3,700 ఖతర్ రియాళ్ళను, వారి మొబైల్ ఫోన్లను, తన సహచరుల యొక్క పాస్ పోర్టులను సైతం దోచుకున్నాడు.ఆ తర్వాత కొల్లగొట్టిన ధనంతో బంగ్లాదేశ్ కు వెళ్ళాడు. పోలిసుల పరిశోధన ప్రకారం నిందితుడు దేశం విడిచి వెళ్లేముందు తన రూంమేట్ల కలసి తాను త్వరగా తన దేశం వెళ్ళాలని రూం తాళం చెవి ఇవ్వాలని కోరాడు. దీంతో వారు దొంగ చేతికి తాళం చెవిని ఇచ్చారు.తర్వాత ఆ ఘరానా రూంమేట్ 3,700 ఖతర్ రియాళ్ళను, వారి మొబైల్ ఫోన్లను, తన సహచరుల యొక్క పాస్ పోర్టులను దొంగిలించి కతర్ విడిచి తన దేశానికి చక్కా వెళ్ళిపోయాడు.కొన్నాళ్ళ తర్వాత బంగ్లాదేశ నుంచి తన మాజీ రూంమేట్లకు ఫోన్ చేసి " మీ పాస్ పోర్టులు మీకు తిరిగి కావాలంటే....నాకు ఒకక్కరు 1,500 ఖతర్ రియాళ్ళను తన ఎకౌంటుకు పంపాలని " బేరం పెట్టాడు. దీనికి నిరాకరించిన వారు లబోదిబోమంటూ స్థానిక పోలీసులను ఆశ్రయించారు. దీంతో కొంతకాలానికి బంగ్లాదేశ్ నుంచి వచ్చిన మరో వ్యక్తి ద్వారా దోచుకొన్న పాస్ పోర్ట్లను వారి యజమానులకు అప్పగించాడు. దోహా పోలీసులు బంగ్లాదేశ్ పోలీసులని సంప్రదించి ఘరానా రూంమేట్ సంబంధించిన సమాచారం అందించారు దీంతో చేసిదేమి లేక వారి వారి పాస్ పోర్టులు తిరిగి బంగ్లాదేశ్ పోలీసు స్టేషన్ వద్ద అప్పగించాడు. కాగా పోలీసులు దోహ శిక్ష అమలుపరచేందుకు ఖతర్ ఆ నిందితుడ్ని తీసుకురానున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







