అపహరించి....ఆపై వారికే బేరం పెట్ట్జిన ఘరానా రూంమేట్

- March 26, 2016 , by Maagulf
అపహరించి....ఆపై వారికే బేరం పెట్ట్జిన ఘరానా రూంమేట్

బంగ్లాదేశ్ కు చెందిన ఒక వ్యక్తికి దోహా నేర న్యాయస్థానం ఒక సంవత్సరం కారాగారం విధించినట్లు స్థానిక అరబిక్ డైలీ ఆర్రయహ్ శుక్రవారం నివేదించారు. ఈ బంగ్లాదేశ్ నిందితుడు తన రూంమేట్ల వద్ద దొంగతనానికి పాల్పడ్డాడు.వారి వద్ద నుంచి 3,700 ఖతర్ రియాళ్ళను, వారి మొబైల్ ఫోన్లను, తన సహచరుల యొక్క పాస్ పోర్టులను సైతం దోచుకున్నాడు.ఆ తర్వాత కొల్లగొట్టిన ధనంతో బంగ్లాదేశ్ కు వెళ్ళాడు. పోలిసుల పరిశోధన ప్రకారం నిందితుడు దేశం విడిచి వెళ్లేముందు తన రూంమేట్ల కలసి తాను త్వరగా తన దేశం  వెళ్ళాలని రూం తాళం చెవి ఇవ్వాలని కోరాడు. దీంతో వారు  దొంగ చేతికి తాళం చెవిని ఇచ్చారు.తర్వాత ఆ ఘరానా రూంమేట్ 3,700 ఖతర్ రియాళ్ళను, వారి మొబైల్ ఫోన్లను, తన సహచరుల యొక్క పాస్ పోర్టులను దొంగిలించి కతర్ విడిచి తన దేశానికి చక్కా వెళ్ళిపోయాడు.కొన్నాళ్ళ తర్వాత బంగ్లాదేశ నుంచి తన మాజీ రూంమేట్లకు ఫోన్ చేసి " మీ పాస్ పోర్టులు మీకు తిరిగి కావాలంటే....నాకు ఒకక్కరు 1,500 ఖతర్ రియాళ్ళను తన ఎకౌంటుకు పంపాలని " బేరం పెట్టాడు. దీనికి నిరాకరించిన వారు లబోదిబోమంటూ స్థానిక పోలీసులను ఆశ్రయించారు. దీంతో కొంతకాలానికి బంగ్లాదేశ్ నుంచి వచ్చిన మరో వ్యక్తి ద్వారా దోచుకొన్న పాస్ పోర్ట్లను వారి యజమానులకు అప్పగించాడు. దోహా పోలీసులు బంగ్లాదేశ్ పోలీసులని సంప్రదించి ఘరానా రూంమేట్ సంబంధించిన సమాచారం అందించారు దీంతో చేసిదేమి లేక వారి వారి పాస్ పోర్టులు తిరిగి బంగ్లాదేశ్ పోలీసు స్టేషన్ వద్ద అప్పగించాడు. కాగా పోలీసులు దోహ శిక్ష అమలుపరచేందుకు ఖతర్ ఆ నిందితుడ్ని తీసుకురానున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com