IPL కి కొత్త స్పాన్సర్..!

- January 11, 2022 , by Maagulf
IPL కి కొత్త స్పాన్సర్..!

న్యూ ఢిల్లీ: ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌ గా చైనా మొబైల్ కంపెనీ తప్పుకుంది. ఆ స్థానంలో దేశీయ దిగ్గజ కంపెనీ టాటా టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోందని ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ వెల్లడించారు. వివో సంస్థ అయిదేళ్ళ కాలానికి అంటే 2018 అంటే 2022 వరకు రూ. 440కోట్లకు స్పాన్సర్ గా డీల్ కుదుర్చుకుంది. అయితేకాలం ముగియనప్పటికీ ఇతర కారణాలతో డీల్ నుంచి తప్పుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ ఏడాది నుంచి లీగ్ పేరు టాటా ఐపీఎల్ గా మారనుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com