కోవిడ్ రూల్స్ పాటించని సంస్థలకు భారీగా ఫైన్
- January 14, 2022
సౌదీ: కొత్త కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని సౌదీ అరేబియా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అన్ని ప్రైవేట్ రంగ సంస్థలను కోరింది. లేదంటే భారీగా జరిమానాలు విధించబడతాయని హెచ్చరించింది. ఎంట్రీ సమయంలో శరీర ఉష్ణోగ్రతను తనిఖీ చేయడం, వ్యాక్సిన్ వేసుకోని లేదా కోవిడ్-పాజిటివ్ వ్యక్తులను అనుమతించడం, సోషల్ డిస్టెన్స్ లేకపోవడం, మాస్కులు పెట్టుకోకపోవడం వంటి కరోనా నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. కరోనా నిబంధనలను పాటించని చిన్న సంస్థలకు SR10,000.. పెద్ద వాటికి SR100,000 వరకు జరిమానాలు విధించబడతాయి. ఉల్లంఘనలు పునరావృతం అయితే ఆయా సంస్థలకు SR200,000 వరకు పెనాల్టీతోపాటు ఆరు నెలల మూసివేతను మంత్రిత్వ శాఖ సూచించింది.
తాజా వార్తలు
- అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో కొత్త ట్విస్ట్..!
- పట్టాభి సీతారామయ్య స్మారక భవనానికి అనుమతులు మంజూరు: ఎంపీ బాలశౌరి
- భారతీయులకు ఎఫెక్ట్..వీసా ఫీజులు పెంచిన యూకే
- తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ శుభవార్త
- ప్రపంచ శాంతి, స్థిరత్వానికి మద్దతు సౌదీ కొనసాగిస్తుంది..కింగ్ సల్మాన్
- యూఏఈలో భారీ వర్షాలు, ఉరుములు, వడగళ్ల వాన కురిసే అవకాశం..!!
- ఖతార్ లో ఉరుములతో కూడిన వర్షం, బలమైన గాలులు..!!
- పౌరులకు, నివాసితులకు ఈద్ శుభాకాంక్షలు తెలిపిన సుల్తాన్..!!
- కువైట్-భారత్ అనుసంధానం..జజీరా ఎయిర్వేస్కు ప్రత్యేక అనుమతి..!!
- ఫేక్ కరెన్సీ.. బహ్రెయిన్ వ్యక్తికి 5 ఏళ్ల జైలు శిక్ష..!!









