క్యాపిటల్ గవర్నరేట్‌లో మసీదు వారంపాటు మూసివేత

- January 16, 2022 , by Maagulf
క్యాపిటల్ గవర్నరేట్‌లో మసీదు వారంపాటు మూసివేత

మనామా: క్యాపిటల్‌ గవర్నరేట్‌లోని మసీదును ఒక వారం పాటు మూసివేస్తూ న్యాయ, ఇస్లామిక్‌ వ్యవహారాలు అండ్ ఎండోమెంట్‌ల మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. తాజాగా మసీదులో ఒకరికి కరోనా వైరస్‌ (COVID-19) పాజిటివ్‌ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం అతని కాంటాక్ట్ లను గుర్తించే ప్రక్రియను నిర్వహించడానికి, ప్రాంగణాన్ని శానిటైజ్ చేయడానికి, అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకునేందుకు వారం పాటు మసీదును మూసివేసిన్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.మసీదుల దగ్గర జాగ్రత్త చర్యలు తీసుకుంటామని, తనిఖీలను తీవ్రతరం చేస్తామని మంత్రిత్వ శాఖ తెలిపింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com