నారా లోకేష్కు కరోనా పాజిటివ్..
- January 17, 2022
అమరావతి: తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కు కోవిడ్ 19 పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని లోకేష్ సోమవారం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నానని, అయితే.. ముందు జాగ్రత్త చర్యగా కోవిడ్ తగ్గిపోయే వరకు హోం ఐసోలేషన్లో ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తనను కలిసిన వారందరూ వీలైనంత త్వరగా కరోనా టెస్టులు చేయించుకుని.. తగు జాగ్రత్తలు తీసుకోవాలని నారా లోకేష్ సూచించారు. ప్రజలందరూ సురక్షితంగా ఉండాలని ఆకాంక్షించారు.
‘'నాకు కోవిడ్ 19 పాజిటివ్గా నిర్ధారణ అయింది. అయితే నాకు ఏ విధమైన కోవిడ్ లక్షణములు కనిపించలేదు. ప్రస్తుతం బాగానే ఉన్నాను. అయితే, కోవిడ్ తగ్గే వరకు హోం ఐసోలేషన్లో ఉండాలని నిర్ణయించుకున్నాను. ఇటీవల కాలంలో నన్ను ఎవరైతే కలిశారో.. వారంతా ఎంత వీలైతే అంత త్వరగా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకుని.. తగు జాగ్రత్తలు తీసుకోండి. ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను.’’ అని నారా లోకేష్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
కాగా, నారా లోకేష్ ఇటీవల కాలంలో ఎక్కువగా ప్రజల్లోనే ఉంటున్నారు. టీడీపీ పటిష్టత కోసం రాష్ట్రవ్యాప్తంగా జోరుగా పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రతి రోజూ వందలాది మంది పార్టీ నాయకులు, ప్రజలను కలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తనకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో వారందినీ లోకేష్ అలర్ట్ చేశారు. తనను కలిసిన ప్రతి ఒక్కరు కరోనా టెస్ట్ చేయించుకుని.. తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- 10 వేలకు పైగా విమాన సర్వీసులు నిలిపివేత
- ఇరాన్లో భారతీయులకు కేంద్రం అత్యవసర అలర్ట్..
- చమురు నిల్వలకు నెలవైన ఖర్గ్ ద్వీపం పై అమెరికా దాడులు
- అస్సాం, కేరళం, పుదుచ్చేరిలో ముగిసిన ఎన్నికల ప్రచారం
- నకిలీ కరెన్సీ కలిగి ఉన్నందుకు 3 ఏళ్ల జైలు శిక్ష..!!
- పాస్పోర్ట్ సేవలు వేగవంతం..కాజ్వే వద్ద సిబ్బందికి ఎలక్ట్రిక్ స్కూటర్లు..!!
- యుద్ధ నివారణకు ప్రయత్నించినా..గల్ఫ్ దేశాల పై ఇరాన్ దాడి చేసింది..!!
- ఒమన్లో వైమానిక కార్యకలాపాలను నివేదించాలని ప్రజలకు విజ్ఞప్తి..!!
- హకీమ్ డిజిటల్ ప్లాట్ఫామ్..తగ్గిన వెయిటింగ్ టైమ్: QRCS
- సంతానశెల్వానికి ఏడాదిపాటు సాలరీ చెల్లించనున్న 'అల్ థికా గ్రూప్'..!!









