64 సబ్స్టేషన్స్ నిర్మించనున్న 'దెవా'
- March 26, 2016
దుబాయ్ ఎలక్ట్రిసిటీ మరియు వాటర్ అథారిటీ (దెవా) 131/11 కిలోవాట్ కెపాసిటీతో 64 సబ్ స్టేషన్స్ని రానున్న మూడేళ్ళలో నిర్మించనుంది. వీటి కోసం 6.7 బిలియన్ దిర్హామ్లు ఖర్చు చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న ఎలక్ట్రిసిటీ నెట్వర్క్స్కి ఈ కొత్త స్టేషన్స్ని లింక్ చేయడం ద్వారా ఎఫీషియన్సీని పెంచాలనే ఉద్దేశ్యంతో ఈ ఇనీషియేట్ తీసుకున్నారు. పెరుగుతున్న అవసరాల నేపథ్యంలో 'దెవా' ప్రజల అవసరాల్ని తీర్చడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దెవా ఎండీ మరియు సీఈఓ సయీద్ మొహమ్మద్ అల్ తాయెర్ మాట్లాడుతూ, ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రిసిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, మిడిల్ ఈస్ట్లో యూఏఈ నెంబర్ 1 పొజిషన్లో ఉందని, ప్రపంచ వ్యాప్తంగా ఈ స్థానం 4 అని చెప్పారు. లాంగ్ టెర్మ్ వ్యూహంతో సామర్థ్యాన్ని పెంచుకోవడం ద్వారా ప్రజల అవసరాన్ని తీర్చాలనే సంకల్పంతో, అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నామని ఆయన చెప్పారు. 2018 వేసవి నాటికి లక్ష్యాన్ని చేరతామని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- ఇండోనేషియాలో కుప్పకూలిన హెలికాప్టర్ఎనిమిది మంది దుర్మరణం
- చిన్ననాటి స్నేహితుడి కోసం సచిన్.. వినోద్ కాంబ్లీకి అండగా మాజీ క్రికెటర్లు
- కొత్త రాయబారుల క్రెడెన్షియల్స్ స్వీకరించిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- ట్రాన్స్మిషన్ లోపం..18,708 Toyota-Lexus వాహనాలు రీకాల్..!!
- నిషేధిత రంగాలకు కార్మికుల బదిలీ..కువైట్ అనుమతి..!!
- యూఏఈ లేబర్ మార్కెట్ స్టెబుల్..సకాలంలో సాలరీలు క్రిడెట్..!!
- నకిలీ హజ్ సేవల ప్రచారం..ఈజిప్షియన్ అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాల పై కింగ్ సుల్తాన్, ఖతార్ ఎమిర్ చర్చలు..!!
- గడువు ముగిసిన ఫైనాన్స్ సర్టిఫికేట్లు..మరో 3 నెలల పాటు పొడిగింపు..!!
- IPL 2026: ముంబై పై పంజాబ్ ఘన విజయం









