64 సబ్స్టేషన్స్ నిర్మించనున్న 'దెవా'
- March 26, 2016
దుబాయ్ ఎలక్ట్రిసిటీ మరియు వాటర్ అథారిటీ (దెవా) 131/11 కిలోవాట్ కెపాసిటీతో 64 సబ్ స్టేషన్స్ని రానున్న మూడేళ్ళలో నిర్మించనుంది. వీటి కోసం 6.7 బిలియన్ దిర్హామ్లు ఖర్చు చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న ఎలక్ట్రిసిటీ నెట్వర్క్స్కి ఈ కొత్త స్టేషన్స్ని లింక్ చేయడం ద్వారా ఎఫీషియన్సీని పెంచాలనే ఉద్దేశ్యంతో ఈ ఇనీషియేట్ తీసుకున్నారు. పెరుగుతున్న అవసరాల నేపథ్యంలో 'దెవా' ప్రజల అవసరాల్ని తీర్చడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దెవా ఎండీ మరియు సీఈఓ సయీద్ మొహమ్మద్ అల్ తాయెర్ మాట్లాడుతూ, ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రిసిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, మిడిల్ ఈస్ట్లో యూఏఈ నెంబర్ 1 పొజిషన్లో ఉందని, ప్రపంచ వ్యాప్తంగా ఈ స్థానం 4 అని చెప్పారు. లాంగ్ టెర్మ్ వ్యూహంతో సామర్థ్యాన్ని పెంచుకోవడం ద్వారా ప్రజల అవసరాన్ని తీర్చాలనే సంకల్పంతో, అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నామని ఆయన చెప్పారు. 2018 వేసవి నాటికి లక్ష్యాన్ని చేరతామని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ
- కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం, 8 కార్లు ఢీ..
- భారతీయుల కోసం కొత్త ‘భా’ షూ సైజింగ్ సిస్టమ్..
- యూఏఈలో పెరగనున్న వాహన, ప్రాపర్టీ బీమా రేట్లు..!
- అక్రమ ప్రాక్టీస్..ప్రవాస మహిళా హెల్త్ ప్రాక్టీషనర్ అరెస్ట్
- వాతావరణ ప్రమాదాలపై కీలక కాన్ఫరెన్స్
- 'మాకు ఇప్పుడు ఇల్లు లేదు'.. దుబాయ్ టవర్ నివాసితులు ఆవేదన
- ఉమ్మడి సహకారం.. ఇండియాతో కువైట్ ఒప్పందం
- జీసీసీ పౌరులకు శుభవార్త..ఇక 5 ఏళ్ల వీసాలు మంజూరు
- దుబాయ్లో 'ISEA' అవార్డుల ప్రధానం