టీడీపీ అధినేత చంద్రబాబుకు కరోనా పాజిటివ్
- January 18, 2022
అమరావతి: ఏపీలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు కరోనా బారిన పడ్డారు.తనలో కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టులు చేయించుకున్న చంద్రబాబుకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.ఈ విషయాన్ని చంద్రబాబు స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.ప్రస్తుతం తాను సెల్ఫ్ ఐసోలేషన్లో ఉన్నట్లు ఆయన తెలిపారు.వైద్యుల సూచన మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.ఇటీవల తనను కలిసినవారందరూ కరోనా టెస్టులు చేయించుకోవాలని చంద్రబాబు సూచించారు.
కాగా చంద్రబాబు తనయుడు నారా లోకేష్కు కూడా సోమవారం కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. తన కుమారుడికి కరోనా రావడంతో తనలోనూ తేలికపాటి లక్షణాలు కనిపించడంతో అనుమానం వచ్చి చంద్రబాబు కూడా కరోనా టెస్టులు చేయించుకున్నారు. దీంతో ఆయనకు కూడా పాజిటివ్ వచ్చింది.ప్రస్తుతం చంద్రబాబు సెల్ఫ్ ఐసోలేషన్లో ఉండటంతో ఈరోజు ఏపీ వ్యాప్తంగా జరిగే ఎన్టీఆర్ వర్థంతి కార్యక్రమాల్లో ఆయన పాల్గొనే అవకాశం లేదు. కాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఏపీలో ఈరోజు నుంచే నైట్ కర్ఫ్యూను ప్రభుత్వం అమలు చేయనున్న సంగతి విదితమే.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి