టీడీపీ అధినేత చంద్రబాబుకు కరోనా పాజిటివ్
- January 18, 2022
అమరావతి: ఏపీలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు కరోనా బారిన పడ్డారు.తనలో కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టులు చేయించుకున్న చంద్రబాబుకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.ఈ విషయాన్ని చంద్రబాబు స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.ప్రస్తుతం తాను సెల్ఫ్ ఐసోలేషన్లో ఉన్నట్లు ఆయన తెలిపారు.వైద్యుల సూచన మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.ఇటీవల తనను కలిసినవారందరూ కరోనా టెస్టులు చేయించుకోవాలని చంద్రబాబు సూచించారు.
కాగా చంద్రబాబు తనయుడు నారా లోకేష్కు కూడా సోమవారం కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. తన కుమారుడికి కరోనా రావడంతో తనలోనూ తేలికపాటి లక్షణాలు కనిపించడంతో అనుమానం వచ్చి చంద్రబాబు కూడా కరోనా టెస్టులు చేయించుకున్నారు. దీంతో ఆయనకు కూడా పాజిటివ్ వచ్చింది.ప్రస్తుతం చంద్రబాబు సెల్ఫ్ ఐసోలేషన్లో ఉండటంతో ఈరోజు ఏపీ వ్యాప్తంగా జరిగే ఎన్టీఆర్ వర్థంతి కార్యక్రమాల్లో ఆయన పాల్గొనే అవకాశం లేదు. కాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఏపీలో ఈరోజు నుంచే నైట్ కర్ఫ్యూను ప్రభుత్వం అమలు చేయనున్న సంగతి విదితమే.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









