భారత్లో కరోనా కేసుల వివరాలు
- January 18, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి.తాజాగా దేశంలో 2,38,018 కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్లో పేర్కొన్నది.నిన్నటి కేసుల కంటే ఈరోజు 20,071 కేసలు తక్కువగా నమోదయ్యాయి.గడిచిన 24 గంటల్లో దేశంలో 1,57,421 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.310 మంది కరోనాతో మృతి చెందినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం భారత్లో 17,36,628 పాజిటివ్ కేసులు ఉన్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 14.43 శాతంగా ఉంది.ఇక ఇదిలా ఉంటే, దేశంలో ఇప్పటి వరకు మొత్తం 8,891 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.ఒమిక్రాన్ కేసుల సంఖ్య 8.31 శాతం పెరిగినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.ఒమిక్రాన్ థర్డ్ వేవ్ కారణంగా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. కరోనా కట్టడి కోసం అనేక రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూలు అమలు చేస్తున్నారు.కొన్ని రాష్ట్రాల్లో వీకెండ్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్డౌన్ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









