హౌతీ తీవ్రవాద దాడిని ఖండించిన బహ్రెయిన్ స్పీకర్
- January 18, 2022
మనామా: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని అబుదాబి ఎమిరేట్ పై హౌతీ ఉగ్రవాద డ్రోన్ దాడిని బహ్రెయిన్ ప్రతినిధుల మండలి స్పీకర్ ఫౌజియా బింట్ అబ్దుల్లా జైనల్ తీవ్రంగా ఖండించారు. తీవ్రవాద దాడులు అంతర్జాతీయ మానవతా ఒప్పందాలను, అంతర్జాతీయ సమాజానికి సవాలుగా మారిందన్నారు. ఈ మేరకు ఆమె UAE ఫెడరల్ నేషనల్ కౌన్సిల్ (FNC) స్పీకర్ సఖర్ ఘోబాష్కి ఒక కేబుల్ పంపారు. అంతర్జాతీయ మానవతా చట్టాన్ని ఉల్లంఘించే ఇలాంటి నేరపూరిత చర్యలను ఖండించాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరారు. తన ప్రాదేశిక సమగ్రత, భద్రత, శాంతిని కాపాడేందుకు UAE తీసుకునే అన్ని చర్యలకు బహ్రెయిన్ మద్దతుగా నిలుస్తుందని ఆమె తెలిపారు.
తాజా వార్తలు
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!
- ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై సౌదీ–గ్రీస్ చర్చలు..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ పనిష్ మెంట్స్ పై విద్యాశాఖ కీలక ఆదేశాలు..!!







