హౌతీ తీవ్రవాద దాడిని ఖండించిన బహ్రెయిన్ స్పీకర్

- January 18, 2022 , by Maagulf
హౌతీ తీవ్రవాద దాడిని ఖండించిన బహ్రెయిన్ స్పీకర్

మనామా: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని అబుదాబి ఎమిరేట్‌ పై హౌతీ ఉగ్రవాద డ్రోన్ దాడిని బహ్రెయిన్ ప్రతినిధుల మండలి స్పీకర్ ఫౌజియా బింట్ అబ్దుల్లా జైనల్ తీవ్రంగా ఖండించారు. తీవ్రవాద దాడులు అంతర్జాతీయ మానవతా ఒప్పందాలను, అంతర్జాతీయ సమాజానికి సవాలుగా మారిందన్నారు. ఈ మేరకు ఆమె UAE ఫెడరల్ నేషనల్ కౌన్సిల్ (FNC) స్పీకర్ సఖర్ ఘోబాష్‌కి ఒక కేబుల్‌ పంపారు. అంతర్జాతీయ మానవతా చట్టాన్ని ఉల్లంఘించే ఇలాంటి నేరపూరిత చర్యలను ఖండించాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరారు. తన ప్రాదేశిక సమగ్రత, భద్రత, శాంతిని కాపాడేందుకు UAE తీసుకునే అన్ని చర్యలకు బహ్రెయిన్ మద్దతుగా నిలుస్తుందని ఆమె తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com