హౌతీ తీవ్రవాద దాడిని ఖండించిన బహ్రెయిన్ స్పీకర్
- January 18, 2022
మనామా: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని అబుదాబి ఎమిరేట్ పై హౌతీ ఉగ్రవాద డ్రోన్ దాడిని బహ్రెయిన్ ప్రతినిధుల మండలి స్పీకర్ ఫౌజియా బింట్ అబ్దుల్లా జైనల్ తీవ్రంగా ఖండించారు. తీవ్రవాద దాడులు అంతర్జాతీయ మానవతా ఒప్పందాలను, అంతర్జాతీయ సమాజానికి సవాలుగా మారిందన్నారు. ఈ మేరకు ఆమె UAE ఫెడరల్ నేషనల్ కౌన్సిల్ (FNC) స్పీకర్ సఖర్ ఘోబాష్కి ఒక కేబుల్ పంపారు. అంతర్జాతీయ మానవతా చట్టాన్ని ఉల్లంఘించే ఇలాంటి నేరపూరిత చర్యలను ఖండించాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరారు. తన ప్రాదేశిక సమగ్రత, భద్రత, శాంతిని కాపాడేందుకు UAE తీసుకునే అన్ని చర్యలకు బహ్రెయిన్ మద్దతుగా నిలుస్తుందని ఆమె తెలిపారు.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







