వాహనాలు, భారీ శబ్దాలు: వేలాది మందికి జరిమానా
- January 20, 2022
అబుధాబి: అబుధాబి పోలీస్ విభాగం ఓ వీడియోను విడుదల చేసింది. వాహనాలకు చట్ట వ్యతిరేకంగా మార్పులు చేసి, విపరీతమైన శబ్దాలతో అవి నడిచేలా చేసేవారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఈ వీడియో ద్వారా అబుధాబి పోలీస్, వాహనదారుల్ని హెచ్చరించడం జరిగింది. 2021లో 2,750 మంది వాహనదారులకు ఈ విషయమై జరిమానాలు విధించినట్లు అబుధాబి పోలీస్ పేర్కొంది. మితిమీరిన శబ్దంతో కూడిన వాహనాలను నడిపేవారికి 2,000 దిర్హాముల జరిమానా, 12 బ్లాక్ పాయింట్లు విధిస్తారు. ఇంజిన్ లేదా ఛాసిస్ మార్పులు (అనధికారికంగా) చేస్తే 1,000 దిర్హాముల జరీమానా, 12 బ్లాక్ పాయింట్లు విధిస్తారు. వాహనాన్ని 30 రోజులపాటు సీజ్ చేయడం జరుగుతుంది. వాహనాన్ని విడిపించుకునేందుకు 10,000 దిర్హాములు చెల్లించాలి, అది కూడా మూడు నెలల్లోనే జరగాలి. లేనిపక్షంలో వాహనాన్ని వేలంలో విక్రయించేస్తారు. అనవసర శబ్దాలు చేసే వాహనాల వల్ల ఇతర వాహనాల డ్రైవర్లకు, ప్రజలకు ఇబ్బందికరంగా వుంటుంది. పిల్లలు, బాగా పెద్దవారు భయాందోళనకు గురవుతారు.
తాజా వార్తలు
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!
- ప్రయాణికులకు సౌదియా గుడ్ న్యూస్..!!
- అబుదాబిలో ఫుల్ కోహ్లీ రెస్టారెంట్ మూసివేత..!!
- బహ్రెయిన్ జైళ్ల శాఖలో సంస్కరణలు..!!
- సముద్రయానంలో ఖతార్ పురోగతి..Q1లో రికార్డు..!!
- నోట్ల కట్టల వివాదం..అలహాబాద్ హైకోర్టు జడ్జి రాజీనామా
- ఏపీ ప్రజలకు అలర్ట్..ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..









