వాహనాలు, భారీ శబ్దాలు: వేలాది మందికి జరిమానా
- January 20, 2022
అబుధాబి: అబుధాబి పోలీస్ విభాగం ఓ వీడియోను విడుదల చేసింది. వాహనాలకు చట్ట వ్యతిరేకంగా మార్పులు చేసి, విపరీతమైన శబ్దాలతో అవి నడిచేలా చేసేవారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఈ వీడియో ద్వారా అబుధాబి పోలీస్, వాహనదారుల్ని హెచ్చరించడం జరిగింది. 2021లో 2,750 మంది వాహనదారులకు ఈ విషయమై జరిమానాలు విధించినట్లు అబుధాబి పోలీస్ పేర్కొంది. మితిమీరిన శబ్దంతో కూడిన వాహనాలను నడిపేవారికి 2,000 దిర్హాముల జరిమానా, 12 బ్లాక్ పాయింట్లు విధిస్తారు. ఇంజిన్ లేదా ఛాసిస్ మార్పులు (అనధికారికంగా) చేస్తే 1,000 దిర్హాముల జరీమానా, 12 బ్లాక్ పాయింట్లు విధిస్తారు. వాహనాన్ని 30 రోజులపాటు సీజ్ చేయడం జరుగుతుంది. వాహనాన్ని విడిపించుకునేందుకు 10,000 దిర్హాములు చెల్లించాలి, అది కూడా మూడు నెలల్లోనే జరగాలి. లేనిపక్షంలో వాహనాన్ని వేలంలో విక్రయించేస్తారు. అనవసర శబ్దాలు చేసే వాహనాల వల్ల ఇతర వాహనాల డ్రైవర్లకు, ప్రజలకు ఇబ్బందికరంగా వుంటుంది. పిల్లలు, బాగా పెద్దవారు భయాందోళనకు గురవుతారు.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







