బహ్రెయిన్: 500 మందికి పైగా భారత వలసదారులు గత ఏడాదిలో మృతి
- January 21, 2022
మనామా: 500 మందికి పైగా భారత వలసదారులు గత ఏడాది కోవిడ్ 19 నేపథ్యంలో తలెత్తిన అనారోగ్య సమస్యలతో బహ్రెయిన్లో మృతి చెందినట్లు గణాంకాలు చెబుతున్నాయి. బహ్రెయిన్లో వివిధ దేశాలకు చెందినవారు నివసిస్తుండగా, ఇంత పెద్ద సంఖ్యలో మృతి చెందింది భారతీయులేనని తెలుస్తోంది. బహ్రెయిన్లో భారత రాయబారి పియుష్ శ్రీవాస్తవ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ పరిస్థితిని హ్యాండిల్ చేయడం ఛాలెంజింగ్ టాస్క్ అని ఆయన పేర్కొన్నారు. బహ్రెయినీ అథారిటీస్ ఈ విషయంలో అందిస్తున్న సహకారం మరువలేనిదని ఆయన అన్నారు. మరణానంతర వ్యవహారాల విషయమై పెద్దగా ఇబ్బందులు లేకుండా వాటిని పూర్తి చేయగలిగామంటే అది అథారిటీస్ సహకారంతోనే జరిగిందని చెప్పారు. సామాజిక కార్యకర్త, కేరళ ప్రవాసీ కమిషన్ సభ్యుడు సుబైర్ కన్నుర్ మాట్లాడుతూ, ఇన్నేళ్ళలో ఎప్పుడూ ఈ స్థాయిలో ప్రవాస భారతీయుల మరణాల్ని చూడలేదని అన్నారు. సుమారుగా 510 మంది భారతీయ వలసదారులు కోవిడ్ కారణంగా చనిపోయారు. ఈ సంఖ్యలో సగానికి పైగా మృతదేహాలకు బహ్రెయిన్లోనే అంత్యక్రియలు నిర్వహించారు. మృతదేహాల తరలింపుకు సంబంధించి బహ్రెయిన్ విధి విధానాలు స్పష్టంగా వున్నాయి. మరణం సంభవించగానే, స్థానిక పోలీసులకు సమాచారం అందించాలి.హెల్త్ మినిస్ట్రీ, ఇంటీరియర్ మినిస్ట్రీ మరియు ఎంబసీ సహకారం కోసం స్పాన్సరింగ్ కంపెనీ లేఖ విడుదల చేయాలి. ఆ లేఖను సీఐడీ డిపార్టుమెంట్ ముందుంచాలి. తద్వారా డెత్ సర్టిపికెట్ అందుతుంది. మృతదేహాన్ని తరలించేందుకు ఎంబసీ వద్ద రిజిస్టర్ చేసి, నో అబ్జెక్షన్ లెటర్ పొందాలి. ఇమ్మిగ్రేషన్ విభాగం నుంచి ఫైనల్ క్లియరెన్స్ కోసం మార్చురీ నుంచి లేఖ సంపాదించాలి. ఒకవేళ మృతదేహాన్ని తరలించడానికి వీలుకాకపోతే, బుసైతీన్ కనూ మస్జీద్, సల్మాబాద్ సిమిటరీలో లేదా అల్బా క్రిమేషన్ సెంటర్లో అంత్యక్రియలు పూర్తి చేస్తారు. రెండేళ్ళ క్రితం నాన్ రెసిడెంట్ కేరలైట్స్ ఎఫైర్స్ రూట్స్, ఎయిర్ ఇండియాతో మృతదేహాల తరలింపు విషయమై అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. కేరళ ప్రభుత్వం కూడా నాన్ రెసిడెంట్ కేరలైట్స్ మృతదేహాలకు సంబంధించి సహాయ సహకారాలు అందిస్తోంది.
తాజా వార్తలు
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ







