తెలంగాణలో కరోనా విజృంభణ

- January 21, 2022 , by Maagulf
తెలంగాణలో కరోనా విజృంభణ

హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది.కరోనా వ్యాప్తి చెంది రెండేళ్లు కావస్తోంది. ప్రభుత్వం చేపట్టిన చర్యల కారణంగా తగ్గుముఖం పట్టగా, ప్రస్తుతం పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్నాయి.ఒక వైపు కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ , మరోవైపు కరోనా కేసులు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇక తాజాగా శుక్రవారం తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 4,416 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఇద్దరు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,26,819 కాగా, మరణాల సంఖ్య 4,069 ఉంది. ఇక రాష్ట్రంలో రికవరీ కేసుల సంఖ్య 6,93,623 ఉండగా, తాజాగా 1920 మంది రికవరీ అయ్యారు. అలాగే రాష్ట్రంలో రికవరీ రేటు 95.43 శాతం ఉంది.ఇక ఐసోలేషన్‌లో 29,127 మంది ఉన్నారు.

ఒక వైపు కరోనా, మరోవైపు కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలంతా కోవిడ్‌ నిబంధ‌న‌లు పాటిస్తే కేసుల సంఖ్యను తగ్గే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com