50 శాతం సిబ్బందితో ప్రభుత్వ కార్యాలయాలు
- January 22, 2022
ఒమన్: రాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్ యంత్రాంగం, ఇతర పబ్లిక్ లీగల్ వ్యక్తుల యూనిట్లలో సిబ్బంది హాజరును మొత్తం ఉద్యోగుల సంఖ్యలో 50%కి తగ్గించాలని సుప్రీం కమిటీ నిర్ణయించింది. ఇతర ఉద్యోగులు రిమోట్గా పని చేయాలని సూచించింది. అన్ని సదస్సులు, ప్రదర్శనల నిర్వహణను వాయిదా వేయాలని సుప్రీం కమిటీ ఆదేశించింది. ప్రత్యేకించి రెస్టారెంట్లు, కేఫ్లు, దుకాణాలు, ఈవెంట్ హాళ్లలో 50% సామర్థ్యం మించకుండా ముందు జాగ్రత్త చర్యలకు కట్టుబడి పనిచేయాలని సుప్రీం కమిటీ సంస్థలను కోరింది. వ్యాక్సిన్లు వేయడం, సామాజిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం తప్పనిసరి చేసింది. అన్ని కాన్ఫరెన్స్ లు, ఎగ్జిబిషన్లు వాయిదా వేయాలని, వ్యాక్సిన్ రుజువుతో సహా పాల్గొనే వారందరికీ తప్పనిసరి నియంత్రణలతో పాటు, పబ్లిక్ స్వభావం గల అన్ని కార్యకలాపాలను కూడా వాయిదా వేయాలి లేదా ప్రేక్షకులు లేనప్పుడు నిర్వహించాలని సూచించింది. ఇకపై శుక్రవారం ప్రార్థనలు నిర్వహించబడవన్నారు. అయితే, రోజువారీ ప్రార్థనలు కొనసాగుతాయని, ఆరాధకుల సంఖ్య వేదిక సామర్థ్యంలో 50% మించకూడదన్నారు. ప్రార్థనలు ఎండోమెంట్స్, మతపరమైన వ్యవహారాల మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించాలని సుప్రీం కమిటీ తెలిపింది.
తాజా వార్తలు
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్









