50 శాతం సిబ్బందితో ప్రభుత్వ కార్యాలయాలు
- January 22, 2022
ఒమన్: రాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్ యంత్రాంగం, ఇతర పబ్లిక్ లీగల్ వ్యక్తుల యూనిట్లలో సిబ్బంది హాజరును మొత్తం ఉద్యోగుల సంఖ్యలో 50%కి తగ్గించాలని సుప్రీం కమిటీ నిర్ణయించింది. ఇతర ఉద్యోగులు రిమోట్గా పని చేయాలని సూచించింది. అన్ని సదస్సులు, ప్రదర్శనల నిర్వహణను వాయిదా వేయాలని సుప్రీం కమిటీ ఆదేశించింది. ప్రత్యేకించి రెస్టారెంట్లు, కేఫ్లు, దుకాణాలు, ఈవెంట్ హాళ్లలో 50% సామర్థ్యం మించకుండా ముందు జాగ్రత్త చర్యలకు కట్టుబడి పనిచేయాలని సుప్రీం కమిటీ సంస్థలను కోరింది. వ్యాక్సిన్లు వేయడం, సామాజిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం తప్పనిసరి చేసింది. అన్ని కాన్ఫరెన్స్ లు, ఎగ్జిబిషన్లు వాయిదా వేయాలని, వ్యాక్సిన్ రుజువుతో సహా పాల్గొనే వారందరికీ తప్పనిసరి నియంత్రణలతో పాటు, పబ్లిక్ స్వభావం గల అన్ని కార్యకలాపాలను కూడా వాయిదా వేయాలి లేదా ప్రేక్షకులు లేనప్పుడు నిర్వహించాలని సూచించింది. ఇకపై శుక్రవారం ప్రార్థనలు నిర్వహించబడవన్నారు. అయితే, రోజువారీ ప్రార్థనలు కొనసాగుతాయని, ఆరాధకుల సంఖ్య వేదిక సామర్థ్యంలో 50% మించకూడదన్నారు. ప్రార్థనలు ఎండోమెంట్స్, మతపరమైన వ్యవహారాల మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించాలని సుప్రీం కమిటీ తెలిపింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







