ముంబై అగ్నిప్రమాదంలో..7కు చేరిన మృతుల సంఖ్య
- January 22, 2022
ముంబై: ముంబైలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. 20 అంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 18వ అంతస్తులో మంటలు వ్యాపించడంతో పలు ఫ్లాట్లు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 7కు చేరుకుంది.మరో 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మరికొంతమంది దట్టమైన పొగతో ఊపిరాడక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సెంట్రల్ ముంబైలోని టార్డియో ప్రాంతంలోని నివాస భవనంలోని 18వ అంతస్తులో జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందినట్టు అధికారులు వెల్లడించారు.
స్థానిక గాంధీ ఆస్పత్రి ఎదురుగా ఉన్న భవనంలో శనివారం ఉదయం 7 గంటలకు మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. భవనం వద్దకు 13 ఫైర్ ఇంజన్లు, 7 వాటర్ జెట్టీలతో ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నించాయి.
ఈ అగ్నిప్రమాద ఘటనపై బృహన్ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (BMC) అధికారులు స్పందించారు. లెవల్-3 అగ్నిప్రమాదంగా చెబుతున్నారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డవారిని, శ్వాస ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారిని దగ్గరలోని భాటియా ఆస్పత్రికి తరలించారు.
ప్రమాదంలో గాయపడిన ఆరుగురు వృద్ధులకు ఆక్సిజన్ సపోర్ట్ అందించినట్టు వైద్యాధికారులు తెలిపారు. భవనంలో మంటలు అదుపులోకి వచ్చాయని, కానీ, దట్టమైన పొగ వ్యాపిస్తోందని పేర్కొన్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







