భారత్‌లో కొనసాగుతున్న కరోనా విజృంభణ

- January 23, 2022 , by Maagulf
భారత్‌లో కొనసాగుతున్న కరోనా విజృంభణ

న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ కట్టడికి కరోనా ఆంక్షలు విధిస్తున్నా కరోనా పాజిటివ్ కేసులు మాత్రం కట్టడి కావడం లేదు. గడిచిన 24 గంటల్లో దేశంలో 3,33,533 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.శనివారంతో పోలిస్తే స్వల్పంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి.తాజాగా 525 మంది మరణించారు.తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,92,37,264కి చేరింది.మొత్తం మరణాల సంఖ్య 4,89,409కి చేరుకుంది.

గడిచిన 24 గంటల్లో 2,59,168 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.దీంతో ప్రస్తుతం 21,87,205 యాక్టివ్ కేసులున్నాయి.దేశంలో డైలీ కరోనా పాజిటివిటీ రేటు 17.78గా నమోదైంది.దేశ వ్యాప్తంగా రికవరీల సంఖ్య 3,65,60,650కి చేరింది.ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 161.92 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు వేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.అలాగే ఇప్పటి వరకు 71.55 కోట్ల మందికి కరోనా పరీక్షలు చేసినట్లు వివరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com