హౌతీ దాడుల్లో చనిపోయిన ఇండియన్స్ కుటుంబ సభ్యులకు జాబ్స్
- February 02, 2022
యూఏఈ: హౌతీ దాడుల్లో చనిపోయిన ఇద్దరు భారతీయుల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు, వారి పిల్లల చదువులకు ఆర్థిక సాయం చేసేందుకు అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ (ADNOC) ముందుకొచ్చింది. ఈ మేరకు యూఏఈలోని భారత రాయబారి సంజయ్ సుధీర్ తెలిపారు. ADNOCలో పనిచేస్తున్న ఇద్దరు భారతీయ డ్రైవర్లు హర్దీప్ సింగ్, హర్దేవ్ సింగ్ జనవరి 17న ముస్సాఫాలోని పారిశ్రామిక ప్రాంతంలో ADNOC పెట్రోలియం ట్యాంకర్ల పేలుళ్లలో ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో ఒక పాకిస్థానీ ప్రవాసుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ సందర్భంగా రాయబారి సంజయ్ సుధీర్ మాట్లాడుతూ.. బాధిత కుటుంబసభ్యులకు నిరంతరం అవసరమైన సాయాన్ని ADNOC, యూఏఈ ప్రభుత్వం అందజేస్తుందన్నారు. రవాణా ఖర్చులు, జీత పరిహారం, ప్రయోజనాలను వేగంగా అందించాయని తెలిపారు. అలాగే గాయపడ్డ ఇద్దరు భారతీయులు రంజాన్ మహ్మద్ రాత్, రామ్ సింగ్ శర్వణన్ లకు మెరుగైన వైద్య సేవలతోపాటు వారి కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని ADNOC అందిస్తోందని సుధీర్ ప్రశంసించారు. యూఏఈ సురక్షిత దేశాల్లో ఒకటని, ఇక్కడ భారతీయులు గతంలో వలే నిశ్చింతగా పనిచేసుకోవాలని ఆయన సూచించారు.
తాజా వార్తలు
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!







