హౌతీ దాడుల్లో చనిపోయిన ఇండియన్స్ కుటుంబ సభ్యులకు జాబ్స్
- February 02, 2022
యూఏఈ: హౌతీ దాడుల్లో చనిపోయిన ఇద్దరు భారతీయుల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు, వారి పిల్లల చదువులకు ఆర్థిక సాయం చేసేందుకు అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ (ADNOC) ముందుకొచ్చింది. ఈ మేరకు యూఏఈలోని భారత రాయబారి సంజయ్ సుధీర్ తెలిపారు. ADNOCలో పనిచేస్తున్న ఇద్దరు భారతీయ డ్రైవర్లు హర్దీప్ సింగ్, హర్దేవ్ సింగ్ జనవరి 17న ముస్సాఫాలోని పారిశ్రామిక ప్రాంతంలో ADNOC పెట్రోలియం ట్యాంకర్ల పేలుళ్లలో ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో ఒక పాకిస్థానీ ప్రవాసుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ సందర్భంగా రాయబారి సంజయ్ సుధీర్ మాట్లాడుతూ.. బాధిత కుటుంబసభ్యులకు నిరంతరం అవసరమైన సాయాన్ని ADNOC, యూఏఈ ప్రభుత్వం అందజేస్తుందన్నారు. రవాణా ఖర్చులు, జీత పరిహారం, ప్రయోజనాలను వేగంగా అందించాయని తెలిపారు. అలాగే గాయపడ్డ ఇద్దరు భారతీయులు రంజాన్ మహ్మద్ రాత్, రామ్ సింగ్ శర్వణన్ లకు మెరుగైన వైద్య సేవలతోపాటు వారి కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని ADNOC అందిస్తోందని సుధీర్ ప్రశంసించారు. యూఏఈ సురక్షిత దేశాల్లో ఒకటని, ఇక్కడ భారతీయులు గతంలో వలే నిశ్చింతగా పనిచేసుకోవాలని ఆయన సూచించారు.
తాజా వార్తలు
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !
- షార్జా–దుబాయ్ మధ్య కొత్త రహదారి అనుసంధానాలు
- షార్జాలోని అల్ బుకైష్ ప్రైవేట్ జూ ప్రత్యేక ఆకర్షణ
- జీ7 సదస్సులో పాల్గొన్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్
- TG20.. బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ
- NEET రీ-ఎగ్జామ్ నేపథ్యంలో భారత్లో టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేధం
- సింగపూర్ CII సమ్మిట్లో సీఎం చంద్రబాబు









